Warangal

News December 28, 2024

నల్లబెల్లి: రుద్రగూడెంలో పులిని చూసిన గ్రామస్థులు

image

నల్లబెల్లి మండలం <<14997161>>రుద్రగూడెం <<>>పెద్ద తండా వద్ద మొక్కజొన్న చేనులో రైతులకు పులి దర్శనం ఇవ్వడంతో వారు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

News December 28, 2024

జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

image

బస్టాండ్ ప్రదేశాలలో(రద్దీ) మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.13 లక్షల విలువైన 171.23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

News December 28, 2024

వరంగల్: వేర్వేరు కారణాలతో ఆరుగురి సూసైడ్

image

ఉమ్మడి WGL జిల్లాలో వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. భార్య విడాకులు ఇచ్చిందని గీసుగొండకు చెందిన శ్రీనివాస్, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని యాదగిరి పురుగు మందు తాగారు. కాశీబుగ్గకు చెందిన రాజేశ్ పెళ్లి కావడం లేదని ఇంట్లో ఉరేసుకోగా.. కాజీపేట సమీపంలో ఓ వ్యక్తి రైలుకింద పడగా.. నెక్కొండ వాసి వీరన్న మద్యానికి బానిసై.. రాయపర్తి వాసి రాజిరెడ్డి అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నారు.

News December 28, 2024

వరంగల్: పెద్ద పులుల సంచారంపై భయం భయం..!

image

వరంగల్ జిల్లాలో <<14996095>>పెద్ద పులుల సంచారం<<>>పై అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్దపులి అడుగుజాడ కనిపించడంతో అటవీ అధికారులు పరిశీలించారు. 2 పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నల్లబెల్లికి సరిహద్దులుగా ఉన్న దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట మండలాల్లోని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 28, 2024

నల్లబెల్లి: అడుగులే పులుల సంచారాన్ని బయటపెట్టాయి!

image

పులుల అడుగుల సైజులతోనే మండలంలో మూడు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా మగ పులి అడుగు పెద్దగా, ఆడపులి అడుగు కొద్దిగా చిన్నగా ఉంటుందని అధికారులు తెలిపారు. రుద్రగూడెంలో పులి అడుగు సైజు 15 నుంచి 20 సెం.మీ కాగా కొండాపురంలో పులి అడుగు 12 నుంచి 15 సెం.మీ, పులి పిల్ల అడుగు 6 నుంచి 8 సెం.మీ ఉండడంతో మండలంలో ఒకటి కాదు మూడు పులుల సంచారం బయటపడింది.

News December 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> BHPL: కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య
> WGL: బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు
> NSPT: రోడ్డు ప్రమాదంలో B.TECH యువకుడి మృతి.. UPDATE
> WGL: వర్ధన్నపేటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
> JN: ఫీట్ లోతులో గుంత.. ప్రమాదకరంగా ప్రయాణం!
> WGL: ఉరి వేసుకుని యువకుడు సూసైడ్
> HNK: రౌడీ షీటర్లను ఉక్కు పాదంతో అణిచివేయాలి

News December 27, 2024

నల్లబెల్లి: అడుగులే పులుల సంచారాన్ని బయటపెట్టాయి!

image

పులుల అడుగుల సైజులతోనే మండలంలో మూడు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా మగ పులి అడుగు పెద్దగా, ఆడపులి అడుగు కొద్దిగా చిన్నగా ఉంటుందని అధికారులు తెలిపారు. రుద్రగూడెంలో పులి అడుగు సైజు 15 నుంచి 20 సెం.మీ కాగా కొండాపురంలో పులి అడుగు 12 నుంచి 15 సెం.మీ, పులి పిల్ల అడుగు 6 నుంచి 8 సెం.మీ ఉండడంతో మండలంలో ఒకటి కాదు మూడు పులుల సంచారం బయటపడింది.

News December 27, 2024

WGL: రేపటి నుంచి మూడు రోజులు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌ను మూసి వేస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

News December 27, 2024

వరంగల్ మార్కెట్‌లో చిరు ధాన్యాల ధరల వివరాలు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. శుక్రవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,490 ధర పలకింది. సూక పల్లికాయ ధర రూ. 6,200, పచ్చి పల్లికాయ రూ.5,200 పలికాయి. అలాగే కొత్త 341 రకం మిర్చి రూ.14వేలు, కొత్త తేజ మిర్చి రూ. 16,016, దీపిక మిర్చి రూ.13 వేలు పలికినట్లు రైతులు తెలిపారు.

News December 27, 2024

నల్లబెల్లి మండలంలో పెద్ద పులులు.. జాగ్రత్త!

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో మగ, ఆడ పెద్ద పులులతో పాటు పులి కూన సంచరిస్తున్న అడుగు జాడలు వెలుగులోకి వచ్చాయి. నల్లబెల్లి మండలం కొండాపురంలో ఆడ పులి, దాని బిడ్డ పులి కూన సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా రుద్రగూడెం వైపు మగ పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.