India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో <<14995644>>ఆడ పులితో పాటు పులి కూన<<>> తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా పెద్ద పులి మలం కొండాపురం ప్రాంతంలోని పంట చేనులో కనిపించింది. మలాన్ని చూసిన ఫారెస్ట్ అధికారులు సాధారణంగా పెద్ద పులి మలం ఎక్కడ కనిపించదని, కేవలం వన విజ్ఞాన కేంద్రంలో కనిపిస్తుందన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదవ సెమిస్టర్కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల(డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.
బైకును కారు ఢీకొట్టడంతో <<14990389>>బీటెక్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందగా.. గాయాలపాలైన శేషు, అభిరామ్ను ఎంజీఎంకు తరలించారు.
జనగామ మాజీ కలెక్టర్ శివలింగయ్యతో పాటు మరో 11 మంది<<14987938>> అధికారులపై ఎఫ్ఐఆర్ <<>>నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో రాచకొండ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత పక్షాన వాదించి ఆమె ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలతో రుజువు చేశారు. దీంతో అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం సమగ్ర ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే విధంగానే తమకు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం నిర్వహిస్తున్న సేవలను పరిశీలించి స్వయంగా వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అక్కంపేట, పెద్దాపూర్ పల్లె దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం గురువారం ఏకాదశి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం, చెరుకుతో మహనివేదన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి వరంగల్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.
హన్మకొండలోని ఏకశిలా కాలేజీలో <<14975739>>ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని<<>> ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కేయూ పోలీస్ స్టేషన్ ఎస్సై బి.రవిందర్ వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన శ్రీదేవి శ్వాస సంబంధిత వ్యాధి సమస్యతో హాస్టల్లోని ఫ్యాన్కు ఉరేసుకుంది. కాగా, దీనికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు రాత్రి వరకు ఆందోళన చేశాయి. కేసు నమోదైంది.
ఉమ్మడి WGLజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.