Warangal

News January 10, 2025

కొడకండ్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం జర్నీ తండా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం, తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 10, 2025

WGL: ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రారంభమైన ఏకాదశి వేడుకలు

image

వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. కాగా మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి బయలుదేరే రోజే వైకుంఠ ఏకాదశిగా చెప్పుకుంటారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

News January 10, 2025

హనుమకొండ: ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్

image

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హౌజ్‌బుజుర్గ్‌ గ్రామానికి చెందిన కమలాకర్(37) పరకాల డివిజన్‌లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా, ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News January 10, 2025

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష

image

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

News January 10, 2025

అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

News January 9, 2025

అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు.

News January 9, 2025

పదవీ విరమణ చేసిన హోంగార్డ్‌ను సత్కరించిన WGL సీపీ

image

సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోం గార్డ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గురువారం క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని హోం గార్డ్‌కు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ నాగయ్య, ఆర్.ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News January 9, 2025

మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి 

image

మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

News January 9, 2025

BHPL: భర్తపై భార్య కత్తితో దాడి.. సహకరించిన కొడుకులు 

image

ఆస్తి కోసం కొడుకులతో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన మొగుపల్లి(M) బంగ్లాపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ 6 ఎకరాల భూమిని వారి పేరు మీద రాయాలంటూ భార్య, ముగ్గురు కుమారులు తరచూ ఒత్తిడికి గురి చేశారు. ఈ విషయంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం భార్య, ముగ్గురు కొడుకులు కత్తితో శ్రీనివాస్‌పై దాడి చేయగా ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది.