Warangal

News December 23, 2024

వరంగల్ జిల్లాలో మొదలైన వరినాట్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు మొదలయ్యాయి. కూలీలు పాటలు పాడుతూ నాట్లు వేస్తుండటంతో పంట పొలాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే పలు చోట్ల ఇప్పుడే మడులు ఏర్పాటు చేసుకొని నారు అలుకుతుండగా.. పలు గ్రామాల్లో మాత్రం నాట్లు వేస్తున్నారు. అంతేకాదు.. చలి, మంచు కురుస్తుండటంతో నారు సైతం ఎదగకపోవడం, ఎరుపెక్కడం వంటి ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. మీ పొలంలో నాటు పూర్తయితే కామెంట్ చేయండి.

News December 23, 2024

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కలెక్టర్లు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ధోత్రే వెంకటేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పటేల్‌లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజార్లు, ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చిరే, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

News December 22, 2024

దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణం: మంత్రి సురేఖ

image

పీవీ నర్సింహారావును మించిన మేధోసంపన్నుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరని మంత్రి కొండా సురేఖ అన్నారు. పివి నర్సింహారావు 20వ వర్ధంతి(డిసెంబర్-23) సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డ అయిన పివి నర్సింహారావు దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

News December 22, 2024

రేపు ప్రారంభం కానున్న వరంగల్ మార్కెట్ 

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News December 22, 2024

వరంగల్: భర్త కూర బాగాలేదన్నడని భార్య ఆత్మహత్యాయత్నం

image

భర్త కూర మంచిగా లేదు అన్నందుకు ఓ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ స్టేషన్‌ రోడ్ సమీపంలో నివాసముండే సర్వారి స్వర్ణముఖి తన భర్త కూర బాగా లేదన్నాడని ఆత్మహత్యకు యత్నించింది. టార్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు.

News December 22, 2024

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీతక్క

image

విజయవాడ కనకదుర్గా అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. స్థానిక నేతలు ఉన్నారు.

News December 22, 2024

వరంగల్ భద్రకాళి అమ్మవారి అలంకరణ

image

తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నేడు ఆదివారం ఆలయ అర్చకులు శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News December 22, 2024

రాయపర్తి SBIలో 19 కిలోల బంగారం చోరీ.. UPDATE

image

<<14659837>>రాయపర్తి ఎస్బీఐ<<>> బ్యాంకులో నవంబర్ 18న జరిగిన 19 కిలోల బంగారం చోరీ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ చోరీకి సంబంధించిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ దొంగతనంలో భాగస్వాములైన వివిధ వ్యక్తుల నుంచి 9 కిలోలు సేకరించారు. మిగిలిన 10 కిలోల బంగారాన్ని దొరకబట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిందితుల్లో ఒకరు నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.

News December 22, 2024

క్రిస్టియన్లపై బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుంది: వరంగల్ ఎంపీ

image

దేశంలో క్రిస్టియన్లపై బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతియుతంగా ఉండే క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నారని, మణిపూర్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహారిస్తుందని అన్నారు.

News December 21, 2024

బాల్యం అంటేనే ఒక మధుర స్మృతి: ఎంపీ కావ్య

image

జఫర్‌గడ్ మండలం కునూరు గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కలిసి నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వరంగల్ కడియం కావ్య హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. బాల్యం అంటేనే ఓ మధుర స్మృతి అని, ఏ పాఠశాలకైనా విద్యార్థులే పునాది అని, మనకు చదువు నేర్పిన పాఠశాలకు మనం ఎదో ఒకటి చేయాలన్నారు.