India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,43,540 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే మగవారితో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. HNK(D) 5,08,618, WGL(D) 7,73,453, జనగామ(D) 7,62,106, MHBD(D) 4,85,692, BHPL(D) 2,78,185, ములుగు(D) 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. WGL జిల్లాలో ఎక్కువ, ములుగులో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పలువురు భక్తులు సిద్దేశ్వరుడిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారిక పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన మంత్రి కొండా సురేఖకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో మేయర్, ఎంపీ కడియం కావ్య చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
హనుమకొండ న్యూ బస్ స్టేషన్లో నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రెండవ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వరంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా జనగామ పట్టణంలో మాంజా కోసుకుని నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే.
వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవి ప్రాంతంలోని చెలిమెల గుట్టల్లో ప్రెషర్బాంబు పేలి బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. అతనితో ఉన్న కుర్సం ఎడమయ్య, సోడి నర్సింహరావులు అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో వారి వద్దకు అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 6 కి.మీ జోల కట్టి బాధితుడిని అంబులెన్స్ సిబ్బంది వినోద్, మరొక వ్యక్తి మోసుకెళ్లారు.
నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు.
వరంగల్ జిల్లా మోగిలిచెర్ల లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్తో మంత్రి చర్చించారు.
Sorry, no posts matched your criteria.