Warangal

News July 13, 2024

వరంగల్ మార్కెట్‌కి 2 రోజుల సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News July 12, 2024

వరంగల్: స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుటధర్నా

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం SFI నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా AEO కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

News July 12, 2024

వర్ధన్నపేట: సినిమా థియేటర్‌లో ఘర్షణ.. యువకుడికి కత్తిపోట్లు

image

వర్ధన్నపేటలోని ఓ సినిమా థియేటర్‌లో శుక్రవారం కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవల్లో విజయ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. సదరు యువకుడికి కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 12, 2024

భద్రకాళి వేద పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

image

వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయ ఆవరణలో గల వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన 8-12 మధ్య వయస్సు ఉండి ఉపనయన సంస్కారం, ఉపాకర్నోత్సర్జనములు పూర్తైనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం వచ్చినవారు పాఠశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 22వరకు వేద పాఠశాల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News July 12, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు, పల్లికాయ ధరలు తగ్గాయి. > నిన్న రూ.13,759పలికిన పసుపు..నేడు రూ. 12,659కి పడిపోయింది. > సూక పల్లికాయ ధర నిన్న రూ. 6160 పలకగా..ఈరోజు రూ.6020 పలికింది. > పచ్చి పల్లికాయ ధర నిన్న రూ.4550 పలకగా.. నేడు రూ. 4300 పలికింది. > 5531 రకం మిర్చికి నిన్న రూ.13వేల ధర రాగా…నేడు రూ.12,500 వచ్చింది.

News July 12, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డు ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా నేడు క్వింటా మక్కలు రూ.2,645 పలికింది. దీంతో మక్కలు పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో మక్కల ధరలు చూస్తే.. సోమవారం రూ.2,605, మంగళవారం రూ.2,615, బుధవారం రూ.2,620, గురువారం రూ.2,635 పలికాయి.

News July 12, 2024

BREAKING.. వరంగల్ జిల్లాలో మరో హత్య

image

పదహారుచింతల్‌లో జరిగిన హత్య మరవకముందే వరంగల్ జిల్లాలో మరో హత్య జరిగింది. గొర్రెకుంట శివారులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు ఏపీకి చెందిన మేస్త్రీగా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం మృతదేహాన్నిఎంజీఎంకు తరలించారు. కాగా, ఈ హత్య దుండగులు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

News July 12, 2024

కొత్తగూడ: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ తదితరులున్నారు.

News July 12, 2024

వరంగల్: అధికంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.160 పెరిగింది. నిన్న రూ.7,300 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,460కి చేరింది. ఈ వారంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ధరలు మరింత పెరగాలని ఆ దిశగా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

News July 12, 2024

కాళేశ్వరంలో కొనసాగుతున్న రెండోదశ పరీక్షలు

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలో పూణే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(CWPRS)కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం జియోఫిజికల్ రెండో దశ పరీక్షలను ఇంజనీరింగ్ అధికారులతో కలసి ముమ్మరం చేసింది. గత ఏడాది నవంబర్లో బ్యారేజీలో సీపేజీ లీకేజీలు ఏర్పడిన నేపథ్యంలో పలుమార్లు NDSA, CWUC బృందాలు పర్యటించాయి. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి.