India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముగ్గులు వేయడం ఒక కళ, ఇలాంటి కళ వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించబడుతాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. మహిళలకు ప్రకృతితో ఒక అవినాభావ సంబంధం ఉందని, మహిళల జీవన విధానంలో ముగ్గులు ఒక భాగమని అన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని AR హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వరంగల్ కమిషరేట్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాం రాజు హెడ్ క్వార్టర్స్కు విధుల నిమిత్తం శనివారం వెళ్తున్నారు. మట్టెవాడ వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో హెడ్ కానిస్టేబుల్కు త్రీవ గాయాలయ్యాయి. వెంటనే ఎంజీఎంకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం HYD తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు చెప్పారు.
రాహుల్ గాంధీ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రచారం చేసింది రూ.15 వేలు.. అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అని చెప్పారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్, అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అని ‘X’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR తీవ్ర స్థాయిలో ధజమెత్తారు
వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్కు చేరుకొని అధికారులతో సమావేశం కానున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. సాయంత్రం 4 గంటలకు గీసుగొండ మండలం మొగిలిచర్ల, విశ్వనాథపురం, గొర్రేకుంటలకు సంబంధించిన విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారు. మొగిలిచర్లలో జరిగే సభలో పాల్గొంటారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
చైనాలో కొత్త వైరస్ HMPV (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) గురించి హనుమకొండ DMHO డా.అప్పయ్య పలు సూచనలు చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించిందన్నారు. వైరస్ శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో సాధారణ చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ అన్నారు. తెలంగాణలో HMPV కేసులపై ఎలాంటి సమాచారం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చైనా నుంచి HMPV(హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్) మహమ్మారి గురించి హన్మకొండ DMHO డా. ఏ.అప్పయ్య పలు సూచనలు చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించిందన్నారు. ఇది శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో సాధారణ చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ అన్నారు. తెలంగాణలో HMPV కేసులపై ఎటువంటి సమాచారం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద దేవిని ఈరోజు MLC బస్వరాజ్ సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్లు కలెక్టరేట్లో కలిశారు. వరంగల్ నగరానికి చెందిన కార్మిక మిల్లు భవనం స్థలంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని, ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కూల్చి వేసిన కార్మిక భవన్ ప్రాంతంలోనే కొత్త కార్మిక భవన్ను నిర్మించాలని కోరారు.
రోడ్డు భద్రత అవగాహన ప్రమాణాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి పాలనాధికారి అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికులకు కలిగిస్తున్న అవగాహన గురించి వారు మంత్రికి వివరించారు.
జిల్లాలో ప్రజలకు రహాదారి భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.