Warangal

News July 12, 2024

‘జనాభా నియంత్రణపై ఫోకస్ పెట్టాలి’

image

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని DMHO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరోగ్య కార్యకర్తలకు హనుమకొండ DMHO డా.సాంబశివరావు పలు సూచనలు చేశారు. జనాభాను అరికట్టేందుకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రమే కాకుండా, కాన్పుల మధ్య అంతరం కోసం తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందన్నారు.

News July 11, 2024

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 27 మందికి స్థానచలనం కల్పిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.

News July 11, 2024

జనగామ: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్ని వీర్ వాయులో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం తెలిపారు. ఇంటర్ లేదా డిప్లమా పూర్తి చేసి, 3-07-2004 నుంచి 03-01-2008 మధ్య పుట్టి పెళ్లి కాని యువతి, యువకులు ఇందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 11, 2024

MHBD: రూ.11.20 లక్షల విలువైన‌ గంజాయి పట్టివేత

image

గంజాయి అక్రమరవాణాను మహబూబాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. MHBD- ఇల్లందు రోడ్డులో కళ్యాణి నర్సరీ వద్ద ఎస్ఐ దీపిక ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కారులో వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన అజిత్ అరుణ్, ఆనందరావును పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రూ.11,20,000 విలువైన‌ 56కేజీల గంజాయి, ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వయ్య తెలిపారు.

News July 11, 2024

తాడ్వాయి: నేను టీచర్ అవుతా: తులసి

image

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

News July 11, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పసుపు, పల్లికాయ ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు క్వింటా పసుపు ధర భారీగా పెరిగింది. నిన్న రూ.12,501 పలికిన పసుపు నేడు రూ. 13,759 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ. 6160 (నిన్న రూ.6110) పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4550 (నిన్న రూ.4300) పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేల ధర వచ్చింది.

News July 11, 2024

కాజీపేట, వరంగల్ మీదుగా ఐఆర్ సీటీ ప్రత్యేక ప్యాకేజీ టూర్

image

కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ఐఆర్ సీటీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర ప్యాకేజ్ టూర్‌ను ప్రవేశ పెట్టినట్లు యాత్ర ఇన్చార్జ్ కొక్కుల ప్రశాంత్ తెలిపారు. యాత్ర ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై అదే నెల 12 వరకు సాగుతుందని తెలిపారు. యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగలు ఉంటుందన్నారు. ఈ యాత్ర ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, మీదుగా సాగుతుందని తెలిపారు.

News July 11, 2024

కేసముద్రం: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు

image

కేసముద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని సిబ్బంది ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 9వ తరగతి చదువుతున్న ఆమె.. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరగా.. సా.5గం. ప్రాంతంలో గురుకులంలోని ఒకటో అంతస్తు పైనుంచి కిందపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

News July 11, 2024

వరంగల్ మార్కెట్లో రూ.100 తగ్గిన పత్తి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మళ్లీ తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఈరోజు రూ.100 పడిపోయింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,24, బుధవారం రూ.7,400 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.7,300కి తగ్గింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.