India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ముక్కోటి ఏకాదశి- వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం వివిధ రకాల చిరు ధాన్యాలు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.7,200 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలికింది. అలాగే పసుపు క్వింటాకు రూ.11,329 ధర పలికింది. కాగా మంగళవారంతో పోలిస్తే పల్లికాయ ధరలు పెరగగా పసుపు ధర స్వల్పంగా తగ్గింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి ఈరోజు మొక్కజొన్న తరలివచ్చింది. మంగళవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి ధర రూ.2,570 పలకగా.. ఈరోజు రూ.2,565కి పడిపోయింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర రూ.15,500 పలకగా, కొత్త 341 రకం మిర్చి సైతం రూ.15,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
భర్త మరణంతో కుమిలిపోతున్న భార్య ఆయన సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన WGLలోని దేశాయిపేటలో జరిగింది. జన్ను సారయ్య, సమ్మక్క(61) దంపతులకు నలుగురు పిల్లలు. సారయ్య మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి భర్తను తలుచుకొని సమ్మక్క నిత్యం కుమిలిపోయేది. ఈక్రమంలో మంగళవారం భర్త సమాధి వద్ద ఉరేసుకుంది. కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజలకు కోటి ఆశలు చూపిన పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదన్నారు. అభయహస్తం ప్రజలను భయపెట్టే, బాధపెట్టే హస్తంగా మారిందని విమర్శించారు. సంవత్సర కాలంలోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.
వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించగా నేడు ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభంఅవుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచిధర పొందాలని సూచిస్తున్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సిద్దేశ్వరుడికి 51 రకాల, 51 కిలోల మిఠాయితో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ పతకాలకు ఎంపిక చేసింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న పీవీఎస్.కుమార్ గుప్తాకు మహోన్నత సేవా పతకానికి ఎంపిక కాగా.. ఆర్.ఎస్.ఐలు క్రిస్తా చారి, యండి నయీమ్, ఎ.ఆర్.ఎస్.ఐ సదానందం, హెడ్ కానిస్టేబుళ్లు మాధవ రెడ్డి, ఆనందం, కానిస్టేబుల్ యాకయ్య సేవా పతకానికి ఎంపికయ్యారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
Sorry, no posts matched your criteria.