Warangal

News December 12, 2024

WGL: రైతులను కలవరపెడుతున్న కత్తెర పురుగు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులకు కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఐదేళ్లుగా ఈ పురుగు క్రమంగా పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పంటలను క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలు చేస్తున్నారు.

News December 12, 2024

MHBD: వారం కిందటే పెళ్లి నిశ్చయం.. యువకుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నర్సింహులపేటకు చెందిన <<14851197>>విష్ణు(29) మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఏఈవోగా పని చేస్తున్న విష్ణుకు వారం కిందట ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే ఏడాది పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది.

News December 12, 2024

పెద్దపులి సంచరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలి: SI

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బోధపురం, ఆలుబాక, పెంకవాకు, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ శివార్లలో పెద్దపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు ధ్రువీకరించారని ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు తెలిపారు. గ్రామస్థులు వ్యవసాయ పనుల నిమిత్తం, పశువుల మేతకు లేదా ఇతర పనులకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.

News December 11, 2024

ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి: మంత్రి పొంగులేటి 

image

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.

News December 11, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: పొంగులేటి

image

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి బుధవారం వరంగల్ అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News December 11, 2024

గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో 16 కేంద్రాల్లో 5471 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

News December 11, 2024

నర్సింహులపేట: కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్

image

కొత్త బట్టలు కొనివ్వలేదని యువతి సూసైడ్ చేసుకుంది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలు.. నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన నాగన్నబోయిన మనీషా(22) బాబాయ్ కుమార్తె వివాహానికి తనకు కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఈ నెల 6న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News December 10, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,800 పలకగా.. మంగళవారం రూ.15,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి గత సోమవారం రూ.14,000 పలకగా నేడు రూ. 13,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే రూ.14,000 ధర వచ్చింది.

News December 10, 2024

పార్లమెంట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న MHBD ఎంపీ

image

అదాని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు నిర్వహించిన ధర్నాలో MHBD ఎంపీ కోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అదాని లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

News December 10, 2024

వరంగల్: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.