India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో నిన్న గ్రామస్థులకు పులి కనిపించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తగూడ, నల్లబెల్లిలో సంచరించిన పులి ఒకటేనని వారు స్పష్టం చేశారు. కాగా, నల్లబెల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. శనివారం ఓ మహిళకు, పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది.
మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.
జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు.
వరంగల్కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలతో నేరాలు తగ్గాయని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నేరాలకు సంబంధించి నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు కోర్టుకు తగిన సాక్షాధారాలు సమర్పించడంతో కమిషనరేట్ పరిధిలో దాదాపు 2,462 మందికి శిక్షలు విధించినట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
వరంగల్కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
నల్లబెల్లి మండలం <<14997161>>రుద్రగూడెం <<>>పెద్ద తండా వద్ద మొక్కజొన్న చేనులో రైతులకు పులి దర్శనం ఇవ్వడంతో వారు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
బస్టాండ్ ప్రదేశాలలో(రద్దీ) మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.13 లక్షల విలువైన 171.23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
Sorry, no posts matched your criteria.