Warangal

News December 10, 2024

వరంగల్: విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

News December 9, 2024

సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2024

ములుగు: నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్

image

నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్ఔ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.

News December 8, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News December 8, 2024

పరకాల: రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలానికి చెందిన వేముల సుమన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రేగొండ వైపునకు వెళుతున్నారు. ఈ క్రమంలో పరకాల సమీపంలో శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమన్ కూతురు సాత్వికతో పాటు పలువురు గాయపడ్డారు. సాత్వికను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News December 7, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎంపీ కావ్య

image

వరంగల్ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

News December 7, 2024

వరంగల్: రేవంత్ పాలనలో జిల్లాలో కావాల్సింది ఏంటి?

image

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏండ్లలో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో కామెంట్ చేయండి.

News December 7, 2024

ములుగు: హ్యాండ్ బాల్ పోటీలకు 12మంది ఎంపిక

image

ములుగు జిల్లా హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాయ్స్ ఎంపికలు నిర్వహించినట్లు హ్యాండ్ బాల్ ఇన్‌ఛార్జ్ కోచ్ కుమారస్వామి తెలిపారు. జిల్లా క్రీడల అధికారి తుల రవి హాజరై 40 మంది క్రీడాకారుల్లో 12 మందిని ఆల్ ఇండియా ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారన్నారు. కాగా, వీరంతా జనవరి 27 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News December 7, 2024

ఇందిరమ్మ ఇళ్లపై జనగామ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News December 6, 2024

గిరిజన యూనివర్సిటీకి రూ.890 కోట్లు మంజూరు: మహబూబాబాద్ ఎంపీ 

image

మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కృషి ఫలించింది. ఎంపీ చొరవతో ములుగు గిరిజన విశ్వ విద్యాలయం కోసం కేంద్రం రూ.890 కోట్లు మంజూరు చేసింది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో నెలకొల్పిన సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేసి పార్లమెంట్‌లో రూ.890 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయించినట్లు ఎంపీ ‘X’ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. దీంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.