Warangal

News December 27, 2024

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి.. UPDATE

image

బైకును కారు ఢీకొట్టడంతో <<14990389>>బీటెక్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్‌కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందగా.. గాయాలపాలైన శేషు, అభిరామ్‌ను ఎంజీఎంకు తరలించారు.

News December 27, 2024

జనగామ: ఈ లాయర్ ఎఫెక్ట్.. మాజీ కలెక్టర్, అధికారులపై FIR

image

జనగామ మాజీ కలెక్టర్ శివలింగయ్యతో పాటు మరో 11 మంది<<14987938>> అధికారులపై ఎఫ్ఐఆర్ <<>>నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో రాచకొండ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత పక్షాన వాదించి ఆమె ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలతో రుజువు చేశారు. దీంతో అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

News December 27, 2024

ములుగు: రోడ్లు ఊడుస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

image

ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం సమగ్ర ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే విధంగానే తమకు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News December 26, 2024

డాక్టర్లు అందుబాటులో ఉన్నారు: DMHO

image

హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం నిర్వహిస్తున్న సేవలను పరిశీలించి స్వయంగా వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అక్కంపేట, పెద్దాపూర్ పల్లె దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News December 26, 2024

HNK: సిద్దేశ్వరునికి అన్నాభిషేకం

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం గురువారం ఏకాదశి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం, చెరుకుతో మహనివేదన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

News December 26, 2024

వరంగల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి వరంగల్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

News December 26, 2024

UPDATE.. వరంగల్: శ్వాస సంబంధిత సమస్యతో విద్యార్థిని ఆత్మహత్య: SI

image

హన్మకొండలోని ఏకశిలా కాలేజీలో <<14975739>>ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని<<>> ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కేయూ పోలీస్ స్టేషన్ ఎస్సై బి.రవిందర్ వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన శ్రీదేవి శ్వాస సంబంధిత వ్యాధి సమస్యతో హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాగా, దీనికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు రాత్రి వరకు ఆందోళన చేశాయి. కేసు నమోదైంది.

News December 25, 2024

WGL: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి WGLజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు గురువారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News December 25, 2024

రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి: వరంగల్‌ సీపీ

image

వరంగల్ సీపీ అంబ కిషోర్‌ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రత దృష్ట్యా రాత్రి వేళలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతం మొక్కను నాటారు.