Warangal

News July 8, 2024

WGL: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్‌స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News July 8, 2024

WGL: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు

News July 8, 2024

BREAKING.. వరంగల్: మాజీ సర్పంచ్ దారుణ హత్య

image

మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం బురాన్‌పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారు. కాగా, భూ తగాదాల విషయంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

SI మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: మాజీ MLA

image

పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News July 8, 2024

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని కోరారు.

News July 8, 2024

WGL: డీఎస్సీ పరీక్షలపై టీ-శాట్ అవగాహన కార్యక్రమాలు

image

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.

News July 7, 2024

అరుణాచల గిరి దేవస్థానానికి వరంగల్ నుంచి స్పెషల్ బస్సులు

image

హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

News July 7, 2024

గీసుకొండలో క్రీ.శ 3వ శతాబ్దానికి చెందిన రాయి లభ్యం

image

క్రీ.శ 3వ శతాబ్దానికి చెందిన ఒక అరుదైన రాయిని గీసుకొండ మండల కేంద్రంలో డిస్కవరీ మ్యాన్ రత్నాకర్ రెడ్డి కనుగొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అరుదైన రాయి అప్పట్లో పూసలు తయారు చేయడానికి వినియోగించి ఉంటారన్నారు. గ్రామంలోని పాటిగడ్డ అనే ప్రాంతంలో చరిత్రకు సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయన్నారు. పురావస్తు శాఖ అధికారులు వాటిని గుర్తించి మ్యూజియంలో భద్రపరచాలని కోరారు.

News July 7, 2024

నర్సంపేట: బావిలో గుర్తు తెలియని మృతదేహం

image

వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరమ్మ కాలనీలోని ఒక బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గుర్తతెలియని వ్యక్తులు కొట్టి బావిలో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2024

బోనం ఎత్తిన మంత్రి కొండ సురేఖ

image

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల మహోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకొని సందడి చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.