Warangal

News December 3, 2024

వరంగల్: జూ పార్కుకు రెండు పెద్ద పులులు

image

హనుమకొండ హంటర్ రోడ్‌లోని కాకతీయ జూ పార్కుకు జిల్లా అటవీ శాఖ అధికారులు రెండు పెద్ద పులులను తీసుకొచ్చారు. హైదరాబాదులోని నెహ్రూ జులాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జూపార్కులో చిరుత, ఎలుగు బంట్లు, జింకలు, నెమళ్లు ఇతర పక్షులు, జంతువులు ఉండగా.. ఇప్పుడు ఈ పెద్దపులులను తీసుకురావడంతో జూ పార్కుకు సందర్శకుల తాకిడి పెరగనుంది.

News December 3, 2024

దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

image

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

News December 3, 2024

విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం

image

హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.

News December 2, 2024

సిద్దేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.

News December 2, 2024

ములుగు: నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు

image

నేటి నుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో అప్పటి అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. వారి గుర్తుగా వారోత్సవాలు నిర్వహిస్తారు. కాగా, ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది.

News December 1, 2024

నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 1, 2024

ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ

image

ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

News December 1, 2024

ప్రజాపాలన విజయోత్సవాల్లో WGL ఎమ్మెల్యే, HNK కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. 

News December 1, 2024

గీసుగొండ: భర్తను చంపిన భార్య, కూతురు

image

తల్లి, కూతురు కలిసి తండ్రిని చంపేశారు. CI మహేందర్ వివరాల ప్రకారం.. దామెర మండలానికి చెందిన లక్ష్మి మొదటి భర్తతో విడిపోయి శాయంపేటహవేలీకి చెందిన సునీల్(36)ని పెళ్లి చేసుకుంది. కాగా, లక్ష్మికి సిరి అనే కూతురు ఉంది. సిరి(16) ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న సునీల్ లక్ష్మిని, సిరిని మందలించాడు. ఈక్రమంలో వీరు పడుకున్న సునీల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. MGMలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News December 1, 2024

ద్వైపాక్షిక సంబంధాల పట్ల టర్కీ ఆసక్తి:మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు టర్కీ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆయన భేటీ అయ్యారు. పరస్పర సహకారంపై అరగంట సేపు వారు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైందని టర్కీ పారిశ్రామిక బృందాన్ని పంపించి ఇక్కడి ఎకోసిస్టంను వారు పరిశీలించేలా చొరవ తీసుకోవాలన్నారు.