Warangal

News November 29, 2024

చేర్యాల: BIRTHDAY రోజే బాలిక మృతి

image

కరెంట్ షాక్‌తో కావ్య(16) అనే <<14732971>>బాలిక మృతి<<>> చెందిన ఘటన చేర్యాలలో జరిగిన విషయం తెలిసిందే. నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నర్సింలు-లావణ్య దంపతుల పెద్ద కూతురు కావ్య ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. నీళ్లు ట్యాంకులోకి పట్టేందుకు మోటార్ వైరును స్విచ్ బోర్డులో పెడుతుండగా కరెంటు షాక్‌కు గురైంది.హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే చనిపోయింది. బాలికకు పుట్టినరోజే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు విలపించారు.

News November 29, 2024

WGL: జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, ఛైర్మన్

image

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజి ఎన్ఆర్ఐ మిలినియం ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీపీఆర్‌వో ఆయుబ్ అలీతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

News November 29, 2024

మండలంగా మల్లంపల్లి.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీతక్క

image

ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం హర్షనీయమని, కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని నిరూపించడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

News November 28, 2024

డివిజన్ హోదాను కల్పించేందుకు కార్యాచరణను ప్రారంభించడం గర్వకారణం: మంత్రి

image

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి సురేఖ అన్నారు.

News November 28, 2024

ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

image

ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఆన్‌లైన్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చేయాలని అధికారులను HNK జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పేమెంట్ చెల్లింపుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News November 28, 2024

MHBD: దీక్షదివస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ కవిత

image

రేపు దీక్షదివాస్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే ఏర్పాట్లను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి దీక్షదివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆమె వెంట డోర్నకల్ మాజీ MLA రెడ్యా నాయక్, తదితరులు ఉన్నారు.

News November 28, 2024

వరంగల్‌: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. గురువారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,840గా ఉంది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరకులను మార్కెట్‌కు తీసుకొని రావాలన్నారు. తేమ లేని సరకులు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 28, 2024

కేయూ పట్ల సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు: ఎమ్మెల్యే

image

కాకతీయ యూనివర్సిటీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. సమకాలీన భారతదేశంలో సామాజిక సంస్థల ద్వారా ప్రపంచీకరణ, అభివృద్ధి, సామాజిక పరివర్తనపై యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం దోహదడుతుందన్నారు.

News November 28, 2024

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్

image

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.

News November 28, 2024

దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క

image

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.