Warangal

News November 26, 2024

వరంగల్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT

News November 26, 2024

మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ కలెక్టర్ 

image

ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మిల్లర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ మిల్లులను భవిష్యత్‌లో ఎటువంటి వ్యాపారం చేయకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు.

News November 25, 2024

వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,475 పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6,000 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,570 పలికింది. తేజా రకం కొత్తమిర్చి క్వింటాకు రూ.15,021 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే నేడు పల్లికాయ ధరలు పెరిగాయి.

News November 25, 2024

KU డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.

News November 25, 2024

నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు

image

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

News November 25, 2024

MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News November 25, 2024

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్

image

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.

News November 25, 2024

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద

image

గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

News November 24, 2024

WGL: దీక్షా దివస్ సందర్భంగా ఇన్‌ఛార్జుల నియామకం

image

నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్ నిర్వహణలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు తెలిపారు.
భూపాలపల్లి-ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్,
వరంగల్-మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి,
హనుమకొండ-ఎమ్మెల్సీ వాణిదేవి,
జనగామ-మాజీ MLA బిక్షమయ్యగౌడ్,
మహబూబాబాద్-మాజీ MLA కొండా బాలా కోటేశ్వర్‌రావు

News November 24, 2024

సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ 

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో కార్తీక మాసం ఆదివారం సందర్భంగా సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం సిద్దేశ్వరుడిని భక్తుల దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు.