Warangal

News November 24, 2024

SUNDAY SPECIAL.. ఆకట్టుకుంటున్న వరంగల్ రీజినల్ లైబ్రరీ

image

వరంగల్‌లో రీజినల్ లైబ్రరీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో ఈ లైబ్రరీని ఆధునికీకరించారు. ఫర్నిచర్, ఇంటర్నెట్, వైఫైతో పాటు.. దాదాపు బుక్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్తుంటే లైబ్రరీ గోడపై రంగులతో దిద్దిన ఓ బాలిక చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ లైబ్రరీని చూసి ఉంటే కామెంట్ చేయండి.

News November 24, 2024

విజయోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖలు

image

ఈనెల 26న గ్రామ పంచాయతీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పాల్గొనాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క లేఖలు రాశారు. నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 95 గ్రామీణ నియోజకవర్గాల్లో రూ.2750 కోట్ల నిధులతో గ్రామ పంచాయతీల్లో ఇందిరా శక్తి మహిళా ఉపాధి భరోసాతో వివిధ అభివృద్ధి పనులు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.

News November 24, 2024

ములుగు: త్వరలో మరో రెండు పథకాలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క

image

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ అందజేస్తునట్లు తెలిపారు. రూ.10లక్షల లోపు ఆరోగ్యశ్రీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు.

News November 24, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైం న్యూస్..

image

> MHBD: ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య..
> JN: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు..
> NSPT: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..
> MHBD: విషపు నీటితో వానరం మృత్యువాత?
> HNK: కల్వర్టు కిందికి దూసుకెళ్లిన టిప్పర్..
> MHBD: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన..
> NSPT: చిత్తుబొత్తు ఆడుతున్న వ్యక్తుల అరెస్ట్

News November 23, 2024

జనగామ: మధ్యాహ్న భోజనం తయారీలో జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

మధ్యాహ్నం భోజనం తయారీలో ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అన్ని పాఠశాలల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం తయారీ చేసే ప్రదేశాలు, పిల్లలు తినే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News November 22, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> BHPL: అంబటిపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం!
> MLG: అన్న దమ్ములను హతమార్చిన మావోలు
> HNK: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు
> MHBD: అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
> PLK: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
> HNK: రాత్రి పూట ఇళ్ళల్లో దొంగతనం చేసే అంతరాష్ట్ర దొంగ అరెస్టు
> JN: ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి

News November 22, 2024

రేపు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఓటర్ డ్రాఫ్ట్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటరు డ్రాఫ్ట్‌ను శనివారం ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ జాబితా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వద్ద పరిశీలన కోసం అందుబాటులో పెట్టనున్నట్లు తెలిపారు.

News November 22, 2024

భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం

image

కార్తీక మాసంలో భాగంగా నేడు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆలయ అర్చకులు పూర్ణాభిషేకం నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి పూర్ణాభిషేకానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భజనలతో ఆలయం మార్మోగింది. నేడు మీరూ భద్రకాళి ఆలయానికి వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.

News November 22, 2024

BREAKING.. ములుగు: అన్నదమ్ములను హతమార్చిన మావోలు

image

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.

News November 21, 2024

గిరిజన వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో గిరిజన జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే గిరిజన వర్కింగ్ జర్నలిస్టులు తమ పేర్లను సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు.