Warangal

News November 21, 2024

పోలీస్‌ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే రీతిలో ప్రజాసేవకు అంకితం కావాలి: సీపీ

image

తోమ్మిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 246 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ (సివిల్‌) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను(దీక్షాంత్‌ పరేడ్‌) గురువారం మడికొండలోని సిటి పోలీస్‌ శిక్షాణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షిస్తూ, పోలీస్‌ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే దిశగా నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళకు పిలుపునిచ్చారు.

News November 21, 2024

హనుమకొండలో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు కోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం బహిరంగ విచారణ చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో చేపట్టిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు బీసీ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

News November 21, 2024

కాంగ్రెస్ భద్రత, రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది: ఎంపీ కావ్య 

image

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ భద్రత, రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం ఖిలా వరంగల్, మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో ట్రెయినీ మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలసి, ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News November 21, 2024

పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కావ్య

image

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తుందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. గురువారం ఖిలా వరంగల్, మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో ట్రెయినీ మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు.

News November 21, 2024

వరంగల్: నిన్నటిలాగే తటస్థంగా మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటిలాగే నేడు మిర్చి ధరలు తటస్థంగా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.15,000 ధర పలకగా.. నేడు కూడా రూ.15వేల ధర పలికింది. అలాగే, 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.14,500 పలికింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి నిన్న రూ.13,500 ధర రాగా ఈరోజు కూడా అదే ధర వచ్చింది.

News November 21, 2024

కులగణన సర్వేపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కులగణన సర్వేపై అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News November 20, 2024

రేపు మహబూబాబాద్‌కి కేటీఆర్ రాక

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహబూబాబాద్ పట్టణానికి రానున్నారు. BRS ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

News November 20, 2024

శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. మౌలాలి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఉమ్మడి WGL జిల్లాలోని JN, KZJ, WL, MHBD, DRKL స్టేషన్లలో ఆగుతూ కొల్లం స్టేషన్ వరకు వెళ్లనుంది. కొల్లం వైపు వెళ్లే రైలు(07143) ఈనెల 22, 29, వచ్చే నెల 6, 13, 20, 27 తేదీల్లో నడవనుంది. అలాగే కొల్లం నుంచి వచ్చే ట్రైన్(07144) ఈనెల 24, వచ్చే నెల 1, 8, 15, 22, 29న నడవనుంది.

News November 20, 2024

సీఎంతో పాటు వేములవాడ సన్నిధిలో మంత్రి సురేఖ

image

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పర్యటన భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం మంత్రులకు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, వేములవాడలో అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

News November 20, 2024

WGL: అన్నదాతలకు ఊరట.. రూ.80 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు నేడు రైతులకు స్వల్ప ఊరట నిచ్చాయి. సోమవారం రూ.6,750 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. మంగళవారం రూ.6,730కి చేరింది. ఈ క్రమంలో నేడు రూ.6,810 పలకడంతో అన్నదాతలకు స్వల్ప ఊరట లభించినట్లు అయింది. అయితే సిసిఐ నిర్దేశించిన ధరకు కొనుగోలు జరగడం లేదని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.