Warangal

News December 13, 2024

నదీ పుష్కరాలపై మంత్రి కొండా సమీక్ష

image

మంత్రి కొండా సురేఖ సారథ్యంలో ‘సరస్వతీ నది పుష్కరాల’పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

News December 13, 2024

వరంగల్ మార్కెట్‌కి 2 రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. 

News December 13, 2024

ములుగు జిల్లాలోనే పెద్దపులి సంచారం!

image

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి బుధవారం పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడ్వాయి మండలం పంబాపూర్ సమీప అడవుల్లో పెద్దపులి పాదముద్రల గుర్తించామని రేంజర్ కోట సత్తయ్య తెలిపారు. ఓ వాగు వద్ద సంచరించినట్లు తెలిపారు. ఆ తర్వాత పాదముద్రలు కనపడలేదన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 13, 2024

సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి కొండా

image

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పర్యాటక భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తారామతి బారాధారిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ హాజరై కార్యక్రమాలను తిలకించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

News December 12, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

News December 12, 2024

అరెస్టు చేయడం దుర్మార్గం: కేటీఆర్

image

గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని సిరిసిల్ల MLA KTR ట్వీట్ చేశారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు.

News December 12, 2024

భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని వినతి

image

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కలిశారు. గూడూరు మండల పరిధిలోని భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని కోరారు. స్థానిక గిరిజన యువత ఉపాధి కల్పించుటకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు కేంద్రం మంత్రితో హుస్సేన్ నాయక్ చర్చించారు. 

News December 12, 2024

కేయూ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. 

News December 12, 2024

WGL: రైతులను కలవరపెడుతున్న కత్తెర పురుగు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులకు కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఐదేళ్లుగా ఈ పురుగు క్రమంగా పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పంటలను క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలు చేస్తున్నారు.

News December 12, 2024

MHBD: వారం కిందటే పెళ్లి నిశ్చయం.. యువకుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నర్సింహులపేటకు చెందిన <<14851197>>విష్ణు(29) మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఏఈవోగా పని చేస్తున్న విష్ణుకు వారం కిందట ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే ఏడాది పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది.