Warangal

News April 3, 2024

132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలి: సీఎండీ

image

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు 16 జిల్లాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఎస్ఏఓలు, డివిజినల్ ఇంజినీర్లతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడారు. 132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు .

News April 3, 2024

KU డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని పొడిగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 3, 2024

వరంగల్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు బి.గోపిని ప్రత్యేక అధికారిగా నియమించారు.

News April 3, 2024

కొమురవెల్లిలో 7న అగ్నిగుండాల కార్యక్రమం

image

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ, ఆలయ ఛైర్మన్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. 7న రాత్రి 12 గంటలకు అగ్నిప్రజ్వలన , 8న ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News April 3, 2024

వరంగల్: క్రమంగా పెరుగుతున్న పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7240కి చేరింది. ఈరోజు స్వల్పంగా పెరిగి, రూ.7260 అయింది. అయితే గతేడాదిలా.. కాకుండా ఈసారి పత్తి ధరలు భారీగా పడిపోయాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2024

WGL: కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి ఓ తల్లి మంగళవారం KNRలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11) మృతి చెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

News April 3, 2024

వేములవాడలో ఈనెల 9 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

image

వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.

News April 3, 2024

వరంగల్: కాంగ్రెస్ నుంచి బక్క జడ్సన్ సస్పెండ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత సస్పెండ్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News April 3, 2024

వరంగల్: బీఆర్ఎస్ నుండి వచ్చినవారే ఎంపీ అభ్యర్థులు 

image

వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవారే కావడం ఆసక్తికర అంశం. అటు మహబూబాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరగానే టికెట్ లభించింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల పార్టీ మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి అలముకుంది.

News April 3, 2024

గుండెపోటుతో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మృతి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్‌కు చెందిన నాగార్జున కొన్ని సంవత్సరాలుగా ఈజీఎస్‌లో టీఏగా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల కొత్తగూడ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.