India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> MLG: అనారోగ్యంతో BRS నాయకుడు మృతి..
> JN: అదుపు తప్పి కెనాల్ లో పడిన ట్రాక్టర్..
> TRR: కారు, బైక్ ఢీ.. ఒకరికి గాయాలు
> JN: PDS బియ్యం పట్టివేత..
> BHPL: PDS బియ్యం పట్టివేత..
> HNK: అక్రమంగా నిల్వ చేసిన పొగాకు స్వాధీనం
> MHBD: ఇసుక డంపును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
> BHPL: లారీ బ్యాటరీల చోరీ…
నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రిన్సిపల్ సంపత్, అధ్యాపకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి: ఎంతో చైతన్యం కలిగిన గడ్డ వరంగల్ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, హామీల అమలు కోసం నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారన్నారు.
ములుగు జిల్లా మేడారం సమ్మక్క తల్లి కొలువైన చిలుకలగుట్ట చుట్టూ విచిత్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం వస్తే అర్ధరాత్రి వేళలో ముగ్గులు వేసి, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, వివిధ రకాల వస్తువులతో పూజలు నిర్వహిస్తున్నారని స్థానిక పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిలకలగుట్ట చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బాలికను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలకుర్తి సీఐ వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలంలోని బోడబండ తండాకు చెందిన యాకు కొద్దిరోజులుగా ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.
మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకువచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
> JN: పెళ్లి చేసుకుంటానని బాలిక వెంట పడిన వ్యక్తిపై కేసు
> PLK: ఎలుగు బంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
> MLG: కారు ఢీ-కొని వ్యక్తి మృతి
> WGL: బ్యాటరీ దొంగలను పట్టుకున్న పోలీసులు
> HNK: శతాధిక వృద్ధురాలు మృతి
> JN: మొండ్రాయి వద్ద అదుపు తప్పి చెట్టుకు ఢీ-కొన్న కారు
> NSPT: షార్ట్ సర్క్యూట్ తో మంటలు
> PKL: పోగొట్టుకున్న ఫోన్ అందజేత
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. దీంతో నగరానికి చేరుకున్న సినీ బృందం ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి ఆలయ సమీపంలో నేడు శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారి ఆధ్వర్యంలో మాయాబజార్ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులు, ఆలయ సమీప గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు.
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్డిఎఫ్సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్కు రావాలన్నారు.
Sorry, no posts matched your criteria.