India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.
నేటి నుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. వారి గుర్తుగా వారోత్సవాలు నిర్వహిస్తారు. కాగా, ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది.
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్లైన్లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.
తల్లి, కూతురు కలిసి తండ్రిని చంపేశారు. CI మహేందర్ వివరాల ప్రకారం.. దామెర మండలానికి చెందిన లక్ష్మి మొదటి భర్తతో విడిపోయి శాయంపేటహవేలీకి చెందిన సునీల్(36)ని పెళ్లి చేసుకుంది. కాగా, లక్ష్మికి సిరి అనే కూతురు ఉంది. సిరి(16) ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న సునీల్ లక్ష్మిని, సిరిని మందలించాడు. ఈక్రమంలో వీరు పడుకున్న సునీల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. MGMలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తెలంగాణాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు టర్కీ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆయన భేటీ అయ్యారు. పరస్పర సహకారంపై అరగంట సేపు వారు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైందని టర్కీ పారిశ్రామిక బృందాన్ని పంపించి ఇక్కడి ఎకోసిస్టంను వారు పరిశీలించేలా చొరవ తీసుకోవాలన్నారు.
> BHPL: అనుమానస్పదంగా మృతి చెందిన ఏఎన్ఎం
> WGL: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
> BHPL: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
> WGL: అన్నారం షరీఫ్ లో వ్యక్తి మృతి
> BHPL: బావ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా బామ్మర్ది మృతి
> HNK: తిరుమలలో గుండెపోటుతో జిల్లా వాసి మృతి
> MHBD: జవాన్ సతీష్ అంతిమయాత్ర
> JN: జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్
గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.