Warangal

News March 25, 2024

అత్తతో హోలీ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

image

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం తన అత్త, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా అత్తా కోడళ్లు రంగులు పూసుకున్నారు. అనంతరం పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 25, 2024

నేటి నుంచి కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆలయ ఈఓ శేషగిరి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 250 మంది పోలీసులతో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 25, 2024

హన్మకొండలో కారు- బైక్ ఢీ.. ఒకరు అక్కడికక్కడే మృతి

image

హన్మకొండ నిట్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని సురేందర్ బైకుపై వెళుతున్నాడు. ఈ క్రమంలో బైకును ఓ కారు ఓవర్ టెక్ చేస్తుండగా ఢీకొంది. ఈ ఘటనలో సురేందర్ అక్కడికిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు.

News March 25, 2024

గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు గుర్తింపు కార్డులు

image

గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుపై సహాయకురాలి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు నెంబర్, సంఘం పేరు ఉండనుంది. ఇప్పటికే వీటి తయారీ పూర్తయ్యిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2600 గ్రామైక్య సంఘాల్లోని ఆయా సంఘాల అధ్యక్షులకు పది రోజుల్లో కార్డులు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News March 25, 2024

వరంగల్: రంగుల విషయంలో జాగ్రత్త!

image

చిన్నా, పెద్ద, ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా చేసుకునే పండగల్లో హోలీ ప్రధానమైంది. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ బంధువులు, మిత్రులపై రంగులు చల్లుతూ.. ఆనందోత్సాహాలతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ రంగులు కాకుండా రసాయనాలతో చేసిన రంగులు కళ్లు, చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News March 25, 2024

బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్

image

BJP వరంగల్ MP అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అరూరి తొలిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి PRP తరఫున పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత BRSలో చేరి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి MLAగా గెలిచి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

News March 25, 2024

మీడియా సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.

News March 24, 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్..

image

బీజేపీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ఆరూరి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించింది. 2014, 2018వ సంవత్సరాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరూరి రమేష్ వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, ఆరూరి రమేష్ బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరగానే వారికి ఎంపీ టికెట్ లభించింది.

News March 24, 2024

వరంగల్: ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి: మంత్రి

image

వరంగల్: హోలీ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగులే మన జీవితంలోని పలు దశలను ప్రతిబింబిస్తాయని, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 24, 2024

వరంగల్: జూపార్క్‌కు త్వరలో పెద్దపులి

image

ఓరుగల్లు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్దపులి త్వరలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండలోని కాకతీయ జూపార్కులో సిద్ధం చేస్తున్నారు. రూ.60 లక్షల వ్యయంతో ఇక్కడ దీనికోసం ప్రత్యేక ఎంక్లోసర్ సిద్ధమైంది. పులికి నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. అడవి వాతావరణం ఉండటం వల్ల అది స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారిణి లావణ్య తెలిపారు.