News July 12, 2024
‘ఎమర్జెన్సీ’కి కారణమిదేనా?1/2
దేశ భద్రతకు ముప్పు వాటిల్లడమే ఎమర్జెన్సీకి కారణమని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానికి మరో కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. రాయ్బరేలీలో ఇందిరా గాంధీపై రాజ్ నారాయణ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పోలీసులతో పాటు కొందరు అధికారులు ఇందిర విజయానికి పనిచేశారని.. డబ్బు, మద్యం పంచారని ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నారాయణ్ పిటిషన్ను కోర్టు స్వీకరించడమే ఎమర్జెన్సీకి దారితీసింది.
Similar News
News October 30, 2024
PBKS సంచలన నిర్ణయం: అర్ష్దీప్ రిలీజ్?
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్దీప్ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.
News October 30, 2024
రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
News October 30, 2024
మందుబాబులకు మరో గుడ్న్యూస్!
AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలోనే మరిన్ని కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందిస్తున్నామని, ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఓ కమిటీ వేశామని, నివేదిక రాగానే రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని కొల్లు స్పష్టం చేశారు.