News March 12, 2025

CBI అంటూ రూ.1.02 కోట్ల లూటీ 

image

CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 13, 2025

‘వికసిత భారత్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొనండి’ 

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025లో యువత అంతా పాల్గొనాలని కలెక్టర్ ఓ. ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. 18 నుంచి 25 సంవత్సరాలలోపు యువత అంతా దేశాభివృద్ధికి వేస్తున్న ప్రణాళికలో భాగస్వాములు కావాలని కోరారు. యువత యాప్‌లో రిజిస్టర్ చేసుకుని వారి షార్ట్ వీడియోలను భారత్ యాప్‌లో అప్లోడ్ చేసి దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు.

News March 12, 2025

స్వచ్ఛ ఆంధ్రలో అందరినీ భాగస్వాములు చేయండి: కలెక్టర్

image

ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

News March 12, 2025

నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’ 

image

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.

error: Content is protected !!