News June 22, 2024
సాక్షిగా దస్తగిరి.. అభ్యంతరం లేదన్న సీబీఐ

AP: వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులకు రిమాండ్ను జులై 5 వరకు నాంపల్లి CBI కోర్టు పొడిగించింది. బెయిల్పై బయట ఉన్న శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. అయితే తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్పై నిందితుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే CBI మాత్రం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.
Similar News
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు(D)లో గ్రీన్ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నట్లు ‘బిర్లాన్యూ’ వెల్లడించింది. తొలి దశలో ₹127Cr వెచ్చిస్తామని, 600 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
* పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు PPP విధానాన్ని అనుసరిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. 2029 నాటికి ₹66000Cr పెట్టుబడులు సమీకరిస్తామంది.
* తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు: తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ విల్సన్


