News March 22, 2024
డ్రగ్స్ కేసు కూపీ లాగుతున్న సీబీఐ

AP: విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు కాకినాడ జిల్లాకు చేరింది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో ఇవాళ సీబీఐ అధికారులు దాడులు చేశారు. అక్కడి సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్లో ఉన్న వివిధ శాంపిల్స్ని విశాఖకు తరలించినట్లు సమాచారం. కాగా విశాఖకు చేరుకున్న డ్రగ్స్ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరుతో బుక్ అయింది.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


