News June 21, 2024
మద్యం విక్రయాలపై CBI విచారణ జరిపించండి: పురందీశ్వరి

AP: గత ప్రభుత్వంలో జరిగిన నాసిరకం మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఎక్సైజ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో అవినీతి, ఇసుక దోపిడీపైనా విచారణకు ఆదేశించాలని వినతిపత్రాలు అందజేశారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మద్యం కొనుగోలు, అమ్మకాల లెక్కల్లో 400% నుంచి 500% తేడా ఉందని ఆరోపించారు.
Similar News
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<
News January 28, 2026
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.


