News August 22, 2024

సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. వెలుగులోకి కీలక అంశాలు(1/2)

image

కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో ప్రధానంగా 24 మందిని విచారించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో CBI పేర్కొంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్, మొదటిసారి ట్రైనీ డాక్టర్ మృత‌దేహాన్ని చూసిన వ్య‌క్తి, బాధితురాలి త‌ల్లిదండ్రులు, వారికి మొద‌టిసారి ఫోన్ చేసిన ఆస్ప‌త్రి అసిస్టెంట్ సూప‌రింటెండెంట్‌‌ను సీబీఐ విచారించింది.

Similar News

News December 4, 2025

SIM Bindingపై ఓటీటీలు, యాప్స్ అసంతృప్తి

image

OTTలు, వాట్సాప్ వంటి యాప్స్ పని చేయాలంటే ఫోన్‌లో యాక్టివ్ SIM ఉండాలన్న <<18424391>>DoT ఆదేశాలపై<<>> బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్(BIF) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అమలును నిలిపేయాలని, యూజర్లపై ప్రభావాన్ని అంచనా వేయకుండా ఉత్తర్వులివ్వడం సరికాదని పేర్కొంది. టెలికాం కంపెనీలు మాత్రం DoTని అభినందించాయి. SIM Bindingతో యూజర్, నంబర్, డివైజ్ మధ్య నమ్మకమైన లింక్ ఉంటుందని, స్పామ్, ఆర్థిక మోసాలను తగ్గించవచ్చని అన్నాయి.

News December 4, 2025

సమంత-రాజ్ పెళ్లి.. మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

image

రాజ్-సమంత పెళ్లి చేసుకున్న మూడు రోజులకు రాజ్ మాజీ భార్య శ్యామలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. ఇటీవల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి. గత నెల 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయింది. నాకు PR టీమ్ లేదు. స్వయంగా రెస్పాండ్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

News December 4, 2025

టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్‌ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.