News June 13, 2024
ఎర్రన్నాయుడు కుటుంబానికి CBN ప్రాధాన్యం

దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ TDP అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భవాని సైతం MLAగా పనిచేశారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


