News February 25, 2025
MLC ఎన్నికల్లో CBN, లోకేశ్కు ఓటు హక్కు.. పవన్ దూరం

AP: CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కు పొందారు. ఈ నెల 27న తాడేపల్లి (M) గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ స్కూల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఉంటున్న Dy.CM పవన్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు, మాజీ CM జగన్ తాడేపల్లిలోనే ఉంటున్నా ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది.
Similar News
News February 25, 2025
ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి ఘటనపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
భర్తని మిస్ అవుతున్నా: టాలీవుడ్ హీరోయిన్

షూటింగ్ సమయంలో తన భర్త జాకీ భగ్నానీని మిస్ అవుతున్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. జాకీతో ఉన్నాననే ఫీల్ రావడం కోసం ఆయన దుస్తులు వేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఈ బ్యూటీ దూరమవ్వగా బాలీవుడ్లో వరుసగా మూవీస్ చేస్తున్నారు. ఆమె నటించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
News February 25, 2025
టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.