News January 27, 2025
పోలవరం నిర్మాణాన్ని జగన్ ఆపేస్తే CBN ఊపిరిపోశారు: నిమ్మల

AP: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 2025 జులైకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పురుషోత్తపట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణ పనులను వైఎస్ జగన్ పూర్తిగా నిలిపేస్తే చంద్రబాబు ఊపిరి పోశారని చెప్పారు. గతంలో రైతులు కన్నీళ్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని దుయ్యబట్టారు.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


