News January 27, 2025
పోలవరం నిర్మాణాన్ని జగన్ ఆపేస్తే CBN ఊపిరిపోశారు: నిమ్మల

AP: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 2025 జులైకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పురుషోత్తపట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణ పనులను వైఎస్ జగన్ పూర్తిగా నిలిపేస్తే చంద్రబాబు ఊపిరి పోశారని చెప్పారు. గతంలో రైతులు కన్నీళ్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని దుయ్యబట్టారు.
Similar News
News January 31, 2026
బాలికల కోసం స్కాలర్షిప్.. నేడే చివరి తేదీ

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ 2025 సాయపడనుంది. దీని ద్వారా ఏటా రూ.30,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ అండర్గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 31 జనవరి 2026. వెబ్సైట్: <
News January 31, 2026
గుళ్లు కూల్చిన గజినీపై పొగడ్తలా: BJP

సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజినీ మహమ్మద్ను మాజీ ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత హమీద్ అన్సారీ పొగడటంపై BJP మండిపడింది. ‘INC హిందూ ద్వేషులను ప్రశంసిస్తుంది. గజినీ, ఔరంగజేబు లాంటి హిందూ ద్వేషుల నేరాలను, అకృత్యాలను కప్పిపుచ్చుతుంది. హిందూ వ్యతిరేక శక్తులను కీర్తిస్తుంది’ అని విమర్శించింది. విదేశీ ఆక్రమణదారుల పట్ల అన్సారీకి ఉన్న అభిమానం అతని సిక్ మైండ్సెట్కు నిదర్శనమని దుయ్యబట్టింది.
News January 31, 2026
ముగ్గురు అమ్మాయిలతో చాహల్.. మీమ్స్ వైరల్

ధనశ్రీతో విడాకులు, మహ్వాశ్తో బ్రేకప్ తర్వాత షెఫాలీతో చాహల్ రిలేషన్లో ఉన్నట్లు <<18957407>>వార్తలు వస్తున్న<<>> విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పలువురు మీమ్స్ను క్రియేట్ చేసి SMలో షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’ తరహాలో ముగ్గురు లేడీస్తో చాహల్ ఉన్నట్లు AI ఫొటోలు వైరలవుతున్నాయి. వీటిపై చాహల్ స్పందిస్తూ ‘మరో ముగ్గురిని వదిలేశారు. నెక్ట్స్ టైమ్ లోతుగా రీసెర్చ్ చెయ్యండి’ అని కామెంట్ చేశారు.


