News April 5, 2025
11 నెలల్లో CBN చేసిన అప్పు రూ.1.47 లక్షల కోట్లు: వైసీపీ

AP: కళ్లార్పకుండా ఒక్క క్షణంలో వేయి అబద్ధాలు చెప్పే పోటీ పెడితే చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అవుతారని YCP సెటైర్లు వేసింది. అప్పులపై అబద్ధాలు చెబుతూ హామీల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించింది. ‘రాష్ట్ర మొత్తం అప్పు 2019 మార్చికి ₹3.90L Cr, 2024 మార్చికి ₹7.21L Cr. ఇప్పుడు ఒక్క పథకమూ అమలు చేయకుండానే CBN 11 నెలల్లో ₹1.47L Cr అప్పు చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది?’ అని ప్రశ్నించింది.
Similar News
News September 13, 2025
TODAY HEADLINES

*మంగళగిరిలో Way2News Conclave.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
*మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: CM చంద్రబాబు
*గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తాం: సజ్జల
*ఉపరాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
*ఈనెల 15 నుంచి TGలో కాలేజీలు బంద్: FATHI
*AP లిక్కర్ కేసులో 10మంది నిందితులకు రిమాండ్ పొడిగింపు
*నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
*USలో భారతీయుడిని తల నరికి దారుణ హత్య
News September 13, 2025
ఆసియా కప్: ఒమన్పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్లో భాగంగా ఒమన్తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.