News September 17, 2024

వచ్చే ఏడాది నుంచి CBSE విధానం: TDP

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో ‘CBSE రద్దు’ ప్రచారంపై TDP స్పందించింది. ‘CBSE విధానం, అసెస్మెంట్‌కు విద్యార్థులు, టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ 1000 స్కూళ్లలో CBSE ఎగ్జామ్స్ మొదలెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక CBSE అసెస్మెంట్ ప్రకారం పరీక్షలు పెడితే, 64%మంది ఫెయిలయ్యారు. అందుకే ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసే వెసులుబాటును ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచే CBSE ఉంటుంది’ అని పేర్కొంది.

Similar News

News November 4, 2025

నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

image

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

News November 4, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News November 4, 2025

విశాఖలో భూప్రకంపనలు

image

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.