News August 11, 2024
CBSE విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు పరీక్షలు

AP: ప్రభుత్వ స్కూళ్లలోని CBSE టెన్త్ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు రేపటి నుంచి 17 వరకు విద్యాశాఖ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు 83 వేల మంది వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి స్కిల్స్ ఎలా ఉన్నాయి? అనేది అంచనా వేసేందుకు ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. వీరు ఆరో తరగతిలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది.
Similar News
News December 21, 2025
నేడే పల్స్ పోలియో.. నిర్లక్ష్యం చేయకండి

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ మిస్ అయితే రేపు, ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ న్యూస్ షేర్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను అలర్ట్ చేయండి.
News December 21, 2025
ధనుర్మాసం: ఆరో రోజు కీర్తన

‘‘తెల్లవారింది, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. స్వామి ఆలయంలోని శంఖధ్వని నీకు వినబడలేదా? పూతనను, శకటాసురుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడే పాలకడలిపై శయనించిన శ్రీమన్నారాయణుడు. మునులు, యోగులు భక్తితో చేస్తున్న ‘హరి! హరి!’ నామస్మరణతో మేమంతా మేల్కొన్నాము. కానీ నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి? ఓ గోపికా! వెంటనే మేల్కొను. మాతో కలిసి ఆ స్వామి వ్రతంలో పాల్గొని మోక్షాన్ని పొందుదాం, రా!’’ <<-se>>#DHANURMASAM<<>>
News December 21, 2025
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగి చూడండి!

లేవగానే లెమన్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే దానికి చిటికెడు పసుపు కలిపితే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘లెమన్ వాటర్లో ఉండే విటమిన్ సీ శరీరంలోని టాక్సిన్స్ను క్లియర్ చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా, కిడ్నీలకు కావాల్సిన సపోర్ట్ను కూడా అందిస్తుంది’ అని చెబుతున్నారు.


