News October 28, 2024

డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు CCTV ఫుటేజీనీ ఎత్తుకెళ్లారు!

image

ఓ బ్యాంకును లూటీ చేసిన దొంగ‌ల ముఠా డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు అక్క‌డి CCTV ఫుటేజ్‌ని కూడా ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. న్యామ‌తి టౌన్‌లోని SBI ACB నెహ్రూ రోడ్ బ్రాంచ్‌లో కిటికీలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్ప‌డిన ముఠా లాక‌ర్ల‌లోని డ‌బ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే పోలీసుల‌కు త‌మ ఆన‌వాళ్లు ల‌భించ‌కూడ‌ద‌ని CCTV ఫుటేజ్‌ని సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 28, 2024

కుటుంబంలో చీలిక తెచ్చారు.. శరద్ పవార్‌పై అజిత్‌ ఫైర్

image

బారామ‌తిలో త‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రొక‌రిని పోటీకి దింపి శ‌ర‌ద్ ప‌వార్ కుటుంబంలో చీలిక తెచ్చార‌ని Dy.CM అజిత్ ప‌వార్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నిక‌ల్లో బారామ‌తి నుంచి త‌న భార్య‌ను పోటీకి దింపి త‌ప్పు చేసినట్టు అంగీక‌రించాన‌ని, అయితే ఇప్పుడు ఇత‌రులు కూడా త‌ప్పు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంద‌న్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్‌కు వ్య‌తిరేకంగా మ‌న‌వ‌డు యుగేంద్రను శ‌ర‌ద్ ప‌వార్‌ రంగంలోకి దింపారు.

News October 28, 2024

వారిని గద్దె దింపేందుకు ఐక్యంగా పనిచేద్దాం: అఖిలేశ్ యాదవ్

image

మహారాష్ట్రలో మహాయుతి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు స‌మ‌ష్టి వ్యూహాన్ని ర‌చించ‌డానికి ఐక్యంగా ప‌నిచేయాల‌ని MVA మిత్ర‌ప‌క్షాల‌కు SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌ సూచించారు. బీజేపీ, అజిత్ ప‌వార్‌, షిండేల‌ను రాష్ట్ర శ‌త్రువులుగా అభివర్ణించారు. వీరిని ఓడించి సానుకూల మార్పు తీసుకొస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌లు మ‌త‌త‌త్వ, వెన్నుపోటు రాజ‌కీయాల నుంచి MHకు విముక్తి క‌ల్పిస్తాయ‌ని పోస్ట్ చేశారు.

News October 28, 2024

వెండి ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం!

image

రాబోయే 12-15 నెల‌ల్లో మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ (MCX)లో KG వెండి ధరలు ₹1.25 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంద‌ని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచ‌నా వేసింది. మ‌ధ్య‌, దీర్ఘ‌కాలంలో స్వ‌ర్ణాన్ని మించి వెండి రాబ‌డులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ ఏడాది MCXలో వెండి 40% పైగా పెరిగి ₹ల‌క్ష‌ మార్క్‌ను అధిగ‌మించింది. ఇక బంగారానికి మీడియం ట‌ర్మ్‌లో ₹81 వేలు, లాంగ్ టర్మ్‌లో ₹86 వేల టార్గెట్ ప్రైస్ సెట్ చేసింది.