News January 31, 2025

సీజ్‌ఫైర్ అమలు: వారి విడుదలలో ఉద్రిక్తత

image

ఇజ్రాయెల్, థాయ్ దేశాలకు చెందిన బందీలను హమాస్ విడుదల చేసే సంద‌ర్భంగా ఉద్రిక్త‌త నెల‌కొంది. పెద్ద సంఖ్యలో హమాస్ సాయుధులు, గాజా పౌరులు బందీలను చుట్టుముట్టారు. దీంతో 100 మందికి పైగా పాల‌స్తీనా ఖైదీల విడుద‌ల‌ను ఇజ్రాయెల్ వాయిదా వేసింది. చివరికి ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్, థాయ్ బందీలను హమాస్ అప్పగించింది. తదుపరి బందీల రక్షణకు మధ్యవర్తులు హామీ ఇవ్వడంతో పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ ప్రారంభించింది.

Similar News

News November 4, 2025

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో 55 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ <>గోరఖ్‌పూర్<<>> 55 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCIలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. అప్లికేషన్ ఫామ్‌పై ట్రాన్సాక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్:https://aiimsgorakhpur.edu.in

News November 4, 2025

మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

image

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.

News November 4, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.