News January 31, 2025
సీజ్ఫైర్ అమలు: వారి విడుదలలో ఉద్రిక్తత

ఇజ్రాయెల్, థాయ్ దేశాలకు చెందిన బందీలను హమాస్ విడుదల చేసే సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో హమాస్ సాయుధులు, గాజా పౌరులు బందీలను చుట్టుముట్టారు. దీంతో 100 మందికి పైగా పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ వాయిదా వేసింది. చివరికి ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్, థాయ్ బందీలను హమాస్ అప్పగించింది. తదుపరి బందీల రక్షణకు మధ్యవర్తులు హామీ ఇవ్వడంతో పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ ప్రారంభించింది.
Similar News
News December 7, 2025
NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (<
News December 7, 2025
అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.
News December 7, 2025
విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.


