News September 16, 2024
త్వరలోనే జనగణన.. కులగణనపై రాని స్పష్టత

పదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. ఇదే సమయంలో కులగణనకు అవకాశం ఉంటుందా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జనగణనలో భాగంగా టెలిఫోన్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సైకిల్, బైక్, కారు, గ్యాస్ కనెక్షన్, సొంత ఇల్లు ఉన్నాయా? అనే వివరాలను తెలుసుకోనున్నారు. 2011లో చివరిగా జనాభా లెక్కలు తీశారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


