News September 30, 2024
కేంద్రం బెంగాల్ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.
Similar News
News October 13, 2025
త్వరలో అమరావతి రైతులను కలుస్తా: CBN

AP: అమరావతి రైతులను <<17990155>>త్వరలో<<>> కచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని CM చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని CRDA ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. HYDను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News October 13, 2025
ఏ దిక్కున ఏం ఉండాలంటే?

ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలంటే తూర్పు, ఉత్తరం దిక్కులు లోతుగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈశాన్యంలో నీటి గుంట (సంపు, బావి) ఉండాలంటున్నారు. ‘పడమర, దక్షిణం దిక్కులు ఎత్తుగా ఉండాలి. నైరుతిలో ధాన్యపు గాదెలు, ట్యాంకులు, ఎక్కువ బరువుండే నిర్మాణాలు ఉండాలి. వంటగది ఆగ్నేయంలో, బాత్రూమ్ వాయువ్యంలో ఉండాలి. ఈ ఆరు అమరికలు ఇంటికి బలాన్ని ఇస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News October 13, 2025
గాజాలో మొదలైన బందీల విడుదల

గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదల మొదలైంది. తొలుత ఏడుగురిని రెడ్ క్రాస్కు హమాస్ అప్పగించింది. త్వరలో మరికొందరిని రిలీజ్ చేయనుంది. మరోవైపు తమ వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎదురుచూస్తున్నారు. పీస్ డీల్ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ నగరంలో భారీగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.