News September 30, 2024
కేంద్రం బెంగాల్ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.
Similar News
News October 10, 2025
13న ఢిల్లీకి చంద్రబాబు.. GOOGLEతో ఒప్పందం!

AP: CM CBN ఈనెల 13న ఢిల్లీ వెళ్లనున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ (IND) VSPలో ₹87,520 కోట్లతో ఏర్పాటుచేయనున్న డేటా సెంటర్పై ఒప్పందం చేసుకోనున్నారని సమాచారం. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కానుంది. దీనికోసం 480 ఎకరాల్లో 3 క్యాంపస్లు ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని అంచనా. 14న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, CBN సమక్షంలో దీనిపై కీలక ప్రకటన రానుంది.
News October 10, 2025
కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. టాప్ కంటెండర్స్ వీరే

నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ 2.30PMకు పీస్ ప్రైజ్ను ప్రకటించనుంది. ఈ అవార్డు కోసం ట్రంప్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు రేసులో ఉన్నారు. 244 వ్యక్తులు, 94 సంస్థలు కలిపి మొత్తం 338 నామినేషన్స్ వచ్చాయి. రష్యా ప్రతిపక్ష నేత భార్య యూలియా, క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సహా UN ఏజెన్సీస్ వంటి పలు సంస్థలు పోటీపడుతున్నాయి.
News October 10, 2025
రూ.509.25 కోట్లు రాబట్టిన ‘కాంతార చాప్టర్-1’

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 509.25 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరగొచ్చని సినీవర్గాలు తెలిపాయి.