News September 30, 2024
కేంద్రం బెంగాల్ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.
Similar News
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
News November 11, 2025
మౌలానా అజాద్ NITలో ఉద్యోగాలు

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 11, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 1

1. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? (జ.బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (జ.దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (జ.ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (జ.సత్యం)
5. మానవుడు వేటి వలన శ్రోత్రియుడగును? (జ.వేదాలు)
6. దేనివలన మహత్తును పొందును? (జ.తపస్సు)
7. మానవునికి సహయపడుతుంది ఏది? (జ.ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (జ.పెద్దలను సేవించుట వలన) <<-se>>#YakshaPrashnalu<<>>


