News November 29, 2024
బీమారంగంలో 100% FDIకి కేంద్రం సై!

భారత బీమా కంపెనీల్లో FDI పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు బీమా వ్యాపారాలను నిర్వహించేందుకు కంపెనీలకు అనుమతించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఇక అన్ని కంపెనీలూ లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందించేందుకు వీలవుతుంది. ఇక ఫారిన్ రీఇన్సూరర్స్ సొంత నిధుల అవసరాన్ని రూ.5000 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.
Similar News
News April 1, 2026
యూరినేషన్ తర్వాత చుక్కలు పడుతున్నాయా?

యూరినేషన్ పూర్తయ్యాక కాసేపటికి కొన్ని చుక్కలు పడటాన్ని పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్(PMD) అంటారు. మధ్య వయస్కుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువకుల్లోనూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ వాపు, పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం, ఎక్కువగా కూర్చొనే అలవాటుతో ఇది సంభవిస్తుందంటున్నారు. తక్కువస్థాయిలో PMD ప్రమాదకరం కాదని, మూత్రంలో రక్తం, మంట, నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
సెన్సస్: మోదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్

దేశవ్యాప్తంగా తొలి దశ జనగణనలో భాగంగా ఇవాళ్టి నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ ఆపరేషన్స్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ <<19530324>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> పూర్తి చేశారు. ఈ ఫొటోలను SMలో పోస్టు చేశారు. ‘సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దేశ ప్రజలంతా ఇందులో భాగం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News April 1, 2026
PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.


