News June 22, 2024
NEET పేపర్ లీక్పై కేంద్రం విచారణ జరుపుతోంది: MP రఘునందన్
TG: NEET పేపర్ లీక్పై కేంద్రం విచారణ జరుపుతోందని BJP MP రఘునందన్ వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఐటీఐఆర్ కింద ప్రతిపాదించిన అన్ని పనులను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. అటు KCRపైనా ఆయన విమర్శలు చేశారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ ఇంటికి ED అధికారులు రాక తప్పదని జోస్యం చెప్పారు.
Similar News
News October 9, 2024
నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.
News October 9, 2024
నిలవాలంటే గెలవాల్సిందే..
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్కు కాస్త ప్లస్గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.
News October 9, 2024
విదేశీ విద్య: ఏ ఇన్టేక్ మంచిది..?
విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్టేక్ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.