News July 1, 2024
మణిపుర్ సమస్యను కేంద్రం పట్టించుకోవడం లేదు: జైరాం

మణిపూర్ ప్రజలు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రధాని మోదీకి.. మణిపుర్ను సందర్శించేందుకు సమయం దొరకడం లేదు. కనీసం అక్కడి ప్రజాప్రతిధులతోనూ చర్చించేందుకు సిద్ధంగా లేరు’ అని ఫైర్ అయ్యారు. గతేడాది మే నెలలో ఆ రాష్ట్రంలో కుకీ, మైతేయి తెగల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 225 మంది చనిపోయారు.
Similar News
News November 7, 2025
తండ్రులకూ డిప్రెషన్.. వారికీ చేయూత కావాలి!

బిడ్డ పుట్టాక తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం వంటివి వస్తాయి. ఇప్పుడు బిడ్డను చూసుకునే బాధ్యత తండ్రికీ ఉంటోంది. రాత్రులు నిద్రలేకపోవడం, బాధ్యతలు, ఖర్చులు, ఒత్తిడి, జాబ్ కారణంగా తండ్రుల్లోనూ పోస్ట్పార్టమ్ డిప్రెషన్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తండ్రికీ కుటుంబం నుంచి చేయూత అవసరం అంటున్నారు.
News November 7, 2025
అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.
News November 7, 2025
Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్కు సంబంధించిన వంటి టికెట్స్ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.


