News July 1, 2024
మణిపుర్ సమస్యను కేంద్రం పట్టించుకోవడం లేదు: జైరాం

మణిపూర్ ప్రజలు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రధాని మోదీకి.. మణిపుర్ను సందర్శించేందుకు సమయం దొరకడం లేదు. కనీసం అక్కడి ప్రజాప్రతిధులతోనూ చర్చించేందుకు సిద్ధంగా లేరు’ అని ఫైర్ అయ్యారు. గతేడాది మే నెలలో ఆ రాష్ట్రంలో కుకీ, మైతేయి తెగల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 225 మంది చనిపోయారు.
Similar News
News December 5, 2025
మోదీ-పుతిన్ నవ్వులు.. ఎక్కడో మండుతున్నట్టుంది!

పుతిన్ భారత పర్యటనతో US అధ్యక్షుడు ట్రంప్కు ‘ఎక్కడో మండుతున్నట్టుంది’ అంటూ ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రంప్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మోదీ-పుతిన్ నవ్వులు చూసి ఆయన ఏడుస్తుంటారని పోస్టులు పెడుతున్నారు. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. రష్యాతో సంబంధాలు పెంచుకున్నామనే అక్కసుతోనే ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది NOV 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.
News December 5, 2025
‘ప్లేస్ నువ్వు చెప్తావా?’.. అచ్చెన్నకు YCP సవాల్

AP: మంత్రి అచ్చెన్నాయుడుకి YCP సవాలు విసిరింది. ‘Xలో ఇలా రంకెలు వేయడమెందుకు అచ్చెన్నాయుడు ప్లేస్ నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? టైం నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? నీతో చర్చకు మా పార్టీ నేతలు రెడీ. ఇంతకీ నువ్వు సిద్ధమా? ఈ సారైనా వస్తావా? పారిపోతావా?’ అంటూ ట్వీట్ చేసింది. ‘జగన్ 5 ఏళ్ల మోసపు పాలన vs కూటమి 18 నెలల అభివృద్ధి పాలన’ అంటూ అచ్చెన్నాయుడు చేసిన ట్వీటుపై ఇలా స్పందించింది.


