News November 9, 2024

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

image

AP: అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత HYDలోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో AP కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ESI కార్పొరేషన్‌కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు. తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.

Similar News

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

image

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 9, 2026

BRSను యాసిడ్ పోసి కడగాలి: రేవంత్

image

TG: BRS పార్టీని యాసిడ్ పోసి కడగాలని, ఆ పార్టీ మొక్క మొలవనివ్వకూడదని CM రేవంత్ ధ్వజమెత్తారు. అప్పుడే రాష్ట్రానికి, మున్సిపాలిటీలకు పట్టిన దుర్భరమైన పరిస్థితి మారుతుందన్నారు. BJP-BRSది విడదీయరాని అనుబంధం అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు BRS పార్లమెంటులో బీజేపీకి సహకరించిందన్నారు. ఆ సాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రేసింగ్ తదితర కేసుల్లో KCR, హరీశ్‌రావు, KTRలను ED, CBI కాపాడుతున్నాయని ఆరోపించారు.

News February 9, 2026

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా: రేవంత్

image

TG: పదేళ్లు పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు తమ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్లు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయంటే వారే కారణం. ఇప్పుడు మళ్లీ వచ్చి ఓటు వేయాలని అడిగేందుకు అర్హత ఉందా?’ అని ఫైర్ అయ్యారు.