News October 28, 2024

జనగణనకు సిద్ధమైన కేంద్రం?

image

2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

Similar News

News January 12, 2026

చివరి 2 వన్డేలకు సుందర్ ఔట్?

image

టీమ్ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. కివీస్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ వేస్తున్న సమయంలో గాయపడటంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చినా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో చివరి 2 ODIలు ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 12, 2026

సోమవారం ఉపవాసం ఉంటున్నారా?

image

సోమవారం ఉపవాసం ఉంటే మానసిక ప్రశాంతత, స్వీయ నియంత్రణ లభిస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి. రోజంతా భక్తితో గడిపి, సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటే కోరికలు నెరవేరి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి.

News January 12, 2026

ధనుర్మాసం: ఇరవై ఎనిమిదో రోజు కీర్తన

image

‘స్వామీ! మేము అడవిలో పశువులను కాచుకునే అజ్ఞానులం. లోక మర్యాదలు తెలియక మిమ్ము ‘‘కృష్ణా, గోవిందా’’ అని పిలిచాం. మా అపరాధాలు మన్నించు’ అని గోపికలు వేడుకున్నారు. పరమాత్మ తమ కులంలో జన్మించడం తమ అదృష్టమని, ఈ బంధం ఎప్పటికీ తెగనిదని భావించారు. తమ అమాయకపు భక్తిని అనుగ్రహించి, వ్రతాన్ని పూర్తి చేసే భాగ్యం ప్రసాదించమని, మోక్షాన్ని ఇచ్చే ఆ పదవిని తమకు దక్కేలా చేయమని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. <<-se>>#DHANURMASAM<<>>