News October 28, 2024

జనగణనకు సిద్ధమైన కేంద్రం?

image

2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

Similar News

News January 13, 2026

రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

News January 13, 2026

PSLV-C62 విఫలం.. అయినా పని చేసింది!

image

ఇస్రో చేపట్టిన PSLV-C62 ప్రయోగం <<18833915>>విఫలమైన<<>> విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ ఉపగ్రహం వేరుపడి, పని చేసింది. తమ కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్‌స్ట్రేటర్ (KID) క్యాప్సుల్ 3 నిమిషాల కీలక డేటాను పంపిందని స్పానిష్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారాడిజం’ ప్రకటించింది. ఫుట్‌బాల్ సైజులో ఉన్న 25 కిలోల క్యాప్సుల్ PSLV స్టేజ్-4లో విజయవంతంగా సపరేట్ అయింది. నిజానికి మూడో దశలోనే రాకెట్ <<18834317>>విఫలమవ్వడం<<>> గమనార్హం.

News January 13, 2026

ఫ్రెషర్లకు ₹18-22 లక్షల ప్యాకేజీ

image

HCLTech ఫ్రెషర్ల వేతనాల్లో భారీ పెంపును ప్రకటించింది. AI, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలున్న ఇంజినీర్లను ‘ఎలైట్ క్యాడర్’గా పరిగణిస్తూ వారికి ఏడాదికి ₹18-22 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సాధారణ ఫ్రెషర్ల వేతనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ. HCLTech మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ కూడా నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ₹21 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఏడాది HCLTech ఇప్పటికే 10,032 మంది ఫ్రెషర్లను తీసుకుంది.