News October 11, 2024
EPFOలో కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం?

ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి వర్గాలకు మరింత లబ్ధి చేకూర్చేలా మార్పులు చేస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఇందులో కనీస పెన్షన్ పరిమితి రూ.1000 నుంచి పెంచడం, పదవీ విరమణ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి, సులభంగా నగదు విత్ డ్రా, నెలవారీ ఆదాయం రూ.15వేల కంటే ఎక్కువగా ఉన్నవారికి పెన్షన్ పథకాన్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


