News June 28, 2024
PSU స్టాక్స్ను విక్రయించనున్న కేంద్రం?

రక్షణ, రైల్వే, ఎరువుల రంగాల్లోని పీఎస్యూ షేర్లలో కొంతభాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మజగాన్ డాక్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (IRFC), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఒక్క IRFC నుంచే కేంద్రానికి ₹7600 కోట్లు రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మి కేంద్రం ₹50వేల కోట్లు రాబట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News April 7, 2026
అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటాయో తెలంగాణకు వచ్చి చూసుకోండి: CM

కేరళంలో 120 నెలల పినరయి విజయన్ పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని TG CM రేవంత్ విమర్శించారు. ‘పినరయిని తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు. 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రూ.20,670 కోట్ల రుణమాఫీ చేశాం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని కోవలంలో వ్యాఖ్యానించారు.
News April 7, 2026
పవర్ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలు.. యువతకు ఇరాన్ పిలుపు

‘హార్ముజ్’ను తెరవకపోతే ఇరాన్లోని బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇందుకు ఇచ్చిన గడువు కొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో దేశంలోని పవర్ ప్లాంట్ల వద్ద మానవ హారాలుగా నిలబడాలని యువత సహా అని వర్గాల ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మౌలిక సదుపాయాలను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ ప్లాన్ వేసింది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది.
News April 7, 2026
చికెన్లో ఈ పార్టులు తినొద్దు!

చికెన్ మంచి ప్రొటీన్ ఫుడ్. అయితే ఇందులోని కొన్ని పార్టులు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు మాత్రమే ఉండే స్కిన్, బాక్టీరియా ఆవాసంగా ఉండే మెడ, తల, లంగ్స్, గిజార్డ్(కందనకాయ), కాళ్లు, తోక భాగాలను తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల జీర్ణసంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్, వింగ్స్ మంచివని పేర్కొంటున్నారు.
#ShareIt


