News August 1, 2024
కేంద్రం vs కేరళ: వయనాడ్ మరణాలకు బాధ్యులెవరు?

విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అవగాహనా లోపం కనిపిస్తోంది. వయనాడ్ విపత్తుపై ముందే అలర్ట్ చేశామని, NDRF టీమ్స్ పంపించామని అమిత్ షా పార్లమెంటులో చెప్పారు. కొండ చరియలు విరిగిపడటంపై రెడ్ అలర్ట్ రాలేదని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ అంటున్నారు. అప్పటికి ఉన్న ఆరెంజ్ అలర్టుల ప్రకారమే జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు. వీరిలో తప్పెవరిదో తెలీదుగానీ అకారణంగా 200+ మంది చనిపోయారు. మీ కామెంట్.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


