News April 4, 2024
డాక్టర్లకు కేంద్రం హెచ్చరిక.. అలా చేస్తే జైలుకే!

దేశంలో జులై1 నుంచి నూతన న్యాయ చట్టం అమల్లోకి రానుంది. నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమయ్యే వైద్యులకు 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే ఛాన్సుంది. భారతీయ న్యాయ సంహిత-2023లోని 106 సెక్షన్ ప్రకారం డాక్టర్లకు 5ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. RMP(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు 2ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా వేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. వీటిపై వైద్యులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.
Similar News
News March 6, 2026
మరోసారి బొత్సకు అస్వస్థత

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.
News March 6, 2026
RECORD: దేశంలోనే పిన్నవయసు CA

రాజస్థాన్కు చెందిన రాజ్కుమారి పరేఖ్ చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA)గా నిలిచారు. ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. 19 ఏళ్ల 126 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ రికార్డు మధ్యప్రదేశ్కు చెందిన నందినీ అగర్వాల్ (19 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది. కాగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి.


