News April 4, 2024
డాక్టర్లకు కేంద్రం హెచ్చరిక.. అలా చేస్తే జైలుకే!

దేశంలో జులై1 నుంచి నూతన న్యాయ చట్టం అమల్లోకి రానుంది. నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమయ్యే వైద్యులకు 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే ఛాన్సుంది. భారతీయ న్యాయ సంహిత-2023లోని 106 సెక్షన్ ప్రకారం డాక్టర్లకు 5ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. RMP(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు 2ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా వేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. వీటిపై వైద్యులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.
Similar News
News December 9, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్కు ఇది ఉపయోగపడనుంది.
News December 9, 2025
అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it


