News January 4, 2025

సోషల్ మీడియా ఖాతాలకు కేంద్రం కొత్త రూల్!

image

దేశంలోని పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఇకపై పేరెంట్స్ అనుమతి తప్పనిసరి కానుంది. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పేరెంట్స్ అనుమతిస్తేనే పిల్లల పర్సనల్ డేటాను సంస్థలు స్టోర్ చేయవచ్చు. ఒకవేళ రూల్స్ ఉల్లంఘిస్తే ఆ కంపెనీలకు ₹250కోట్ల వరకూ ఫైన్ ఉంటుంది. దీనిపై FEB18లోగా <>Mygov సైట్‌లో<<>> ప్రజలు తమ సూచనలు తెలపొచ్చని కేంద్రం పేర్కొంది.

Similar News

News November 22, 2025

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

image

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.

News November 22, 2025

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

image

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.

News November 22, 2025

ఆవూ దూడా ఉండగా మధ్య గుంజ ఆర్చిందట

image

కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు తమలో తాము గొడవపడుతున్నప్పుడు, ఆ పోట్లాటలో మధ్యలో జోక్యం చేసుకున్న వ్యక్తి నష్టపోతాడు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవును, దూడను కట్టేసినప్పుడు వాటి మధ్య ‘గుంజ’ ఆధారంగా ఉంటుంది. ఆవు, దూడ అటూఇటూ లాక్కోవడం వల్ల వాటి బలం తట్టుకోలేక మధ్యలో ఉన్న ‘గుంజ’ విరిగిపోయినట్లుగా, ఇద్దరు వ్యక్తుల గొడవలో మూడో వ్యక్తి బలి అవుతాడని ఈ సామెత భావం.