News November 28, 2024

‘ప్రత్యేక హోదా’పై కేంద్రం కొత్త రాగం.. సరికొత్త చర్చ

image

APకి ప్రత్యేక హోదా హామీని మౌఖికంగా ఇచ్చామని, రాతపూర్వకంగా ఇవ్వలేదని కేంద్రం చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల హోదా ఇవ్వలేదన్న కేంద్రం ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. ఇలా అయితే పార్లమెంట్ సాక్షిగా PM ఇచ్చిన వాగ్దానానికి విలువలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాతపూర్వక హామీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పించుకోవడం సరికాదని నిపుణుల అభిప్రాయం. మీరేమంటారు?

Similar News

News January 26, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగ‌రేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్‌పై మూడో T20Iలో భారత్ విజయం

News January 26, 2026

T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.

News January 26, 2026

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

image

AP: తిరుమల కొండపై రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుండగా చిరు జల్లులు, వెలుగుల మధ్య ఏడుకొండలవాడు అద్వితీయంగా కనువిందు చేశారు. భక్తులు స్వామిని స్మరిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.