News November 28, 2024

‘ప్రత్యేక హోదా’పై కేంద్రం కొత్త రాగం.. సరికొత్త చర్చ

image

APకి ప్రత్యేక హోదా హామీని మౌఖికంగా ఇచ్చామని, రాతపూర్వకంగా ఇవ్వలేదని కేంద్రం చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల హోదా ఇవ్వలేదన్న కేంద్రం ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. ఇలా అయితే పార్లమెంట్ సాక్షిగా PM ఇచ్చిన వాగ్దానానికి విలువలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాతపూర్వక హామీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పించుకోవడం సరికాదని నిపుణుల అభిప్రాయం. మీరేమంటారు?

Similar News

News January 22, 2026

పెనుగంచిప్రోలు: వృద్ధురాలి నేత్రదానం.. నలుగురికి చూపు!

image

పెనుగంచిప్రోలుకు చెందిన రాజ్యలక్ష్మి (70) రోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందిన రాజ్యలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ముందు, ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించగా, వైద్య బృందం రాజ్యలక్ష్మి నేత్రాల నుంచి కార్నియాను సేకరించారు. రాజ్యలక్ష్మి మరణించినా, ఆమె దానం చేసిన నేత్రాల ద్వారా నలుగురు అంధులకు చూపు లభించనుంది.

News January 22, 2026

ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

image

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?

News January 22, 2026

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.