News July 30, 2024

₹185L crకు చేరనున్న కేంద్రం అప్పు

image

ఈ ఏడాది మార్చి నాటికి కేంద్రం అప్పు ₹171L cr అని కేంద్ర మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. ఇది జీడీపీలో 58.2 శాతానికి సమానమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పు ₹185L crకు చేరే అవకాశం ఉందని చెప్పారు.

Similar News

News March 5, 2025

‘ఛావా’ సంచలనం.. రూ.500 కోట్లకు చేరువలో మూవీ

image

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. 19 రోజులకు రూ.471 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఎల్లుండి తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఈ వారాంతానికి రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

News March 5, 2025

వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల పిటిషన్

image

సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10రోజుల కస్టడీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

News March 5, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య సెకండ్ సెమీ ఫైనల్ జరుగుతోంది. లాహోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపొంది ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!