News February 20, 2025

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయాన్ని విడుదల చేసింది. ఏపీకి రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లను ఇచ్చింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు నిధుల్ని విడుదల చేసింది. వాటిలో త్రిపుర(రూ.288.93 కోట్లు), ఒడిశా(రూ.255.24 కోట్లు), నాగాలాండ్(రూ.170.99 కోట్లు) ఉన్నాయి. ఈ సాయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 7, 2025

‘రాజాసాబ్‌’కు ఆర్థిక సమస్యలా?.. నిర్మాత క్లారిటీ!

image

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా <<18489140>>రిలీజ్<<>> వాయిదా పడటం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ గురించీ ఊహాగానాలు రావడంతో నిర్మాత TG విశ్వ ప్రసాద్ స్పందించారు. ‘సినిమా విడుదలకు అంతరాయం కలిగించే ప్రయత్నం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. రాజాసాబ్ కోసం సేకరించిన పెట్టుబడులను క్లియర్ చేశాం. మిగిలిన వడ్డీని త్వరలోనే చెల్లిస్తాం’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

News December 7, 2025

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.
* ఇంట్లో తయారు చేసిన స్వీట్స్​లో షుగర్​ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరసం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్​ కూడా వాడొచ్చు.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News December 7, 2025

అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.