News February 20, 2025
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయాన్ని విడుదల చేసింది. ఏపీకి రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లను ఇచ్చింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు నిధుల్ని విడుదల చేసింది. వాటిలో త్రిపుర(రూ.288.93 కోట్లు), ఒడిశా(రూ.255.24 కోట్లు), నాగాలాండ్(రూ.170.99 కోట్లు) ఉన్నాయి. ఈ సాయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 1, 2026
నిర్మలమ్మ పద్దు.. ₹54 లక్షల కోట్లు?

2026-27 కేంద్ర బడ్జెట్ ₹54 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 7.9 శాతం ఎక్కువని చెబుతున్నాయి. 2025-26లో కేంద్రం ₹50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరోవైపు జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కనీసం రూ.15 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు స్టాండర్డ్ డిడక్షన్ను రూ.75 వేల నుంచి 90 వేలకు పెంచే అవకాశం ఉందని సమాచారం.
News February 1, 2026
APPLY NOW: NALCOలో ఉద్యోగాలు

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News February 1, 2026
డాన్సర్స్, ఫ్యామిలీలకు రామ్చరణ్ బంపర్ ఆఫర్

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన దాదాపు 500 మంది మెంబర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం ఆయన రూ.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన మాటను రామ్చరణ్ నిలబెట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. SMలో చెర్రీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


