News August 1, 2024
జనగణనలో కేంద్ర వైఫల్యం: సోనియా

2021లో జరగాల్సిన జనగణనను ఇప్పటికీ చేపట్టలేదని, కేంద్రానికి ఆ ఉద్దేశమే లేదని CPP ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. కేంద్ర వైఫల్యంతో దేశంలోని జనాభా ఎంతో తెలియడం లేదన్నారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 12 కోట్ల మంది, ముఖ్యంగా SC, STలు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. CPP మీటింగ్లో మాట్లాడుతూ.. రైతులు, యువత డిమాండ్లను బడ్జెట్లో పట్టించుకోలేదని మండిపడ్డారు.
Similar News
News January 13, 2026
వంటింటి చిట్కాలు

* వెండి వస్తువులు నల్లగా మారిపోతే వాటికి టమాటా కెచప్ రాసి, 15 నిమిషాల తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.
* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
News January 13, 2026
BHELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) హరిద్వార్లో 50 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 -27ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.10,900చెల్లిస్తారు. వెబ్సైట్: hwr.bhel.com
News January 13, 2026
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి

AP: సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు అదనపు ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని వివరించారు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని కోరారు.


