News September 22, 2024
ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు
AP: తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Similar News
News September 22, 2024
VIRAL: ఈ ఆటో డ్రైవర్ చాలా స్మార్ట్!
ఆన్లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకునేందుకు బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్లో క్యూఆర్ కోడ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈయన మరీ అడ్వాన్స్డ్గా ఉన్నారంటూ నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ఇది యూపీఐ స్వాగ్. పేమెంట్స్ చేయడం చాలా ఈజీ’ అని Xలో పోస్ట్ చేశారు.
News September 22, 2024
తిరుమల లడ్డూ వివాదంపై సద్గురు, రవిశంకర్ కామెంట్స్
తిరుమల లడ్డూ కల్తీ అవడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆధ్యాత్మిక గురువులు సద్గురు, రవిశంకర్ అన్నారు. అందుకే దేవాలయాల నిర్వహణ బాధ్యతలను భక్తులకు అప్పగించాలని వ్యాఖ్యానించారు. భక్తి లేని చోట పవిత్రత ఉండదని సద్గురు పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలను వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు కాకుండా మత పెద్దలు, భక్తులకు అప్పగించాల్సిన టైమ్ వచ్చిందని రవి శంకర్ ట్వీట్ చేశారు.
News September 22, 2024
4వ రోజు ఆట షురూ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు 4వ రోజు ఆట మొదలైంది. 6 వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా 357 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుత స్కోర్ 187/4గా ఉంది. క్రీజులో శాంటో(61), షకీబ్ అల్ హసన్(21) ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 328 రన్స్ చేయాలి. భారత్ గెలవాలంటే బంగ్లాను ఆలౌట్ చేయాల్సి ఉంది. అటు ఇంకో రోజు ఆట మిగిలి ఉంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.