News June 16, 2024
తెలంగాణ, ఏపీ రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఏడాదికి గాను 23 మంది రచయితలకు యువ పురస్కార్ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుకు TGలోని నిజామాబాద్కు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ ఎంపికయ్యారు. ఆయన గిరిజనుల జీవిత గాథలపై ‘ఢావ్లో’ అనే కథా సంకలనాన్ని రచించారు. అటు APలోని వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ను ‘మాయాలోకం’ నవలకు గాను బాలసాహిత్య పురస్కారం వరించింది. సాహిత్య అకాడమీ వీరికి ₹50వేలు, జ్ఞాపిక ఇవ్వనుంది.
Similar News
News October 24, 2025
స్వాతి కార్తె అంటే ఏంటి?

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.
News October 24, 2025
ఇక ఇంటర్ ఫస్టియర్లోనూ ప్రాక్టికల్స్

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్కు కేటాయిస్తారు. ఇంటర్లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.
News October 24, 2025
కెనడాతో ట్రంప్ కటీఫ్.. ట్రేడ్ చర్చలు రద్దు!

కెనడాతో అన్ని రకాల ట్రేడ్ చర్చలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఓ యాడ్లో Ex ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ను తప్పుగా ఉటంకించిందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కెనడా మోసపూరితంగా యాడ్ చేసిందని రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ ప్రకటించింది. అది ఫేక్ యాడ్. టారిఫ్స్పై రీగన్ నెగటివ్గా మాట్లాడుతున్నట్లు ఉంది’ అని ట్రంప్ చెప్పారు. US జాతీయ భద్రత, ఎకానమీకి టారిఫ్స్ చాలా ముఖ్యమని అన్నారు.


